రాణి పద్మావతి
From Wikipedia, the free encyclopedia
పద్మిని ని పద్మావతి అని కూడా పిలుస్తారు. ఈమె 13 వ -14 వ శతాబ్దపు భారతీయ రాణి.16 వ శతాబ్దపు గ్రంథాలు అనేకం ఆమె గురించి ప్రస్తావించాయి. వాటిలో 1540లో మాలిక్ ముహమ్మద్ జైసీ రాసిన ఒక పురాణ కల్పిత కవిత " పద్మావత్ " మొట్టమొదటి మూలంగా విశ్వసించబడుతుంది.
ఈ వ్యాసంలో అక్షరదోషాలు, వ్యాకరణం, శైలి, ధోరణి మొదలైన వాటిని సరి చెయ్యడం కోసం కాపీ ఎడిటింగు చెయ్యాల్సి ఉంది. (ఫిబ్రవరి 2020) |
జయసీ వ్రాతలు ఆమె కథను ఈ క్రింది విధంరాజ్యవరిస్తుంది: పద్మావతి సింహళ రాజ్యానికి (శ్రీలంక) చెందిన పద్మిని ఉహాతీతమైన అందమైన యువరాణి. చిత్తూరు కోట రాజపుత్ర పాలకుడు రతన్ సేన్ రాకుమారి పద్మావతి అందం గురించి హీరామన్ (మాట్లాడే చిలుక) చెప్పగా విన్నాడు. ఆయన సాహసోపేతంగా అన్వేషణ సాగించి ఆమెను చేరుకొని తరువాత వివాహం ద్వారా చేపట్టి ఆమెను తీసుకుని చిత్తూర్ కోటకు తీసుకువచ్చాడు. రతన్ సేన్ ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ చేత బంధించి ఖైదు చేయబడ్డాడు. రతన్ సేన్ జైలులో ఉండగా రాజు కుంభాల్నెరు దేవ్పాలు పద్మావతి అందానికి ఆకర్షితుడై ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతిపాదించాడు. రతన్ సేన్ చిత్తూరు కోటకు తిరిగివచ్చి దేవ్పాలుతో ద్వంద్వ యుద్ధం చేసాడు. ద్వంద్వ యుద్ధంలో రతన్ సేన్, దేవ్పాలు ఇద్దరూ మరణించారు. పద్మావతిని పొందేందుకు అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తూరును ముట్టడించాడు. ఖిల్జీకి వ్యతిరేకంగా పోరాడి ఓటమి ఎదుర్కున్న తరువాత చిత్తూరు పట్టుబడింది. పద్మావతి సహచరులు జౌహర్ స్వీయ-ఆత్మాహుతి చేసుకొని ఖిల్జీ లక్ష్యాన్ని ఓడించి తమ గౌరవాన్ని కాపాడుకున్నారు. రాజపుత్రులు యుద్ధభూమిలో పోరాడి మరణించారు.
హిందూ, జైన సంప్రదాయాల్లో ఆమె గురించి అనేక ఇతర లిఖిత, మౌఖిక సంప్రదాయ కథనాలు వాడుకలో ఉన్నాయి.సంస్కరించబడిన రచనలు సుఫీ కవి జయసీ రచనలకు మద్య భేదాలు ఉంటాయి. ఉదాహరణకు రాణి పద్మిని భర్త రతన్ సేన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ముట్టడిని వ్యతిరేకించి పోరాడుతూ మరణించిన తరువాత ఆమె ఆత్మాహుతి చేసుకుందని కొంతమంది తమ వ్రాతలలో ప్రస్తావించారు. ఈ సంస్కరణలలో ఆమె హిందూ రాజపుత్ర రాణిగా వర్ణించబడింది. ఒక ముస్లిం దండయాత్రకు వ్యతిరేకంగా ఆమె గౌరవాన్ని కాపాడుకోవడాన్ని రచయిత సమర్థించాడు. సంవత్సరాలుగా ఆమె చారిత్రాత్మక వ్యక్తిగా కనిపించింది. ఆమె పాత్ర అనేక నవలలు, నాటకాలు, టెలివిజన్ సీరియళ్ళు, సినిమాలలో కనిపించింది. 1303 లో ఖిల్జీ చిత్తూరు ముట్టడి చారిత్రక సంఘటన అయినప్పటికీ అనేక మంది ఆధునిక చరిత్రకారులు పద్మిని పురాణాలలో ఆమె ఉనికి ప్రామాణికతను ప్రశ్నించారు.