రాష్ట్రకూటులు
From Wikipedia, the free encyclopedia
రాష్ట్రకూటులు సా.శ. 6 -10 వ శతాబ్దాల మధ్య భారత ఉపఖండంలోని పెద్ద భాగాలను పాలించిన రాజవంశం. పురాతన రాష్ట్రకూట శాసనమైన 7 వ శతాబ్దపు రాగి పలక, మధ్య లేదా పశ్చిమ భారతదేశంలోని మనపురా అనే నగరం నుండి వారు చేసిన పాలనను వివరిస్తుంది. అదే సమయంలో అచలాపూర్, కన్నౌజ్ వంటి ఇతర ప్రాంతాలను పాలించిన రాజులు కూడా రాష్ట్రకూటులే. ఈ తొలి రాష్ట్రకూటుల మూలం గురించి, వారి మాతృభూమి, భాషల గురించీ అనేక వివాదాలు ఉన్నాయి.
మాన్యఖేట రాష్ట్రకూటులు | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
753–982 | |||||||||
Extent of Rashtrakuta Empire, 800 CE, 915 CE | |||||||||
స్థాయి | Empire | ||||||||
రాజధాని | మాన్యఖేట | ||||||||
సామాన్య భాషలు | కన్నడ సంస్కృతం | ||||||||
మతం | Hinduism Jainism Buddhism[1] | ||||||||
ప్రభుత్వం | Monarchy | ||||||||
Maharaja | |||||||||
• 735–756 | Dantidurga | ||||||||
• 973–982 | Indra IV | ||||||||
చరిత్ర | |||||||||
• Earliest Rashtrakuta records | 753 | ||||||||
• స్థాపన | 753 | ||||||||
• పతనం | 982 | ||||||||
| |||||||||
Today part of | India |
ఎలిచ్పూర్ తెగ బాదామి చాళుక్యులకు పాలెగాళ్ళుగా ఉండేవారు. దంతిదుర్గుడు చాళుక్య రెండవ కీర్తివర్మను అధికారం నుండి కూలదోసి, ఆధునిక కర్ణాటక లోని గుల్బర్గా ప్రాంతం కేంద్రంగా ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాడు.సా.శ. 753 లో దక్షిణ భారతదేశంలో అధికారంలోకి వచ్చిన ఈ వంశం మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులుగా పేరుబడింది. అదే సమయంలో బెంగాల్ యొక్క పాల వంశం, మాళ్వాకు చెందిన ప్రతీహార రాజవంశాలు తూర్పు, వాయవ్య భారతదేశంలో బలపడుతున్నాయి. అరబిక్ గ్రంథం, సిల్సిలాత్ అల్-తవారిఖ్ (851), రాష్ట్రకూటులను ప్రపంచంలోని నాలుగు ప్రధాన సామ్రాజ్యాలలో ఒకటిగా పేర్కొంది.[2]
ఈ కాలం, 8 వ 10 వ శతాబ్దాల మధ్య, సంపద్వంతమైన గంగా మైదానాల వనరుల కోసం త్రిముఖ పోరాటం జరిగింది. ఈ మూడు సామ్రాజ్యాలూ కొద్ది కొద్ది కాలాల పాటు కన్నౌజ్ వద్ద అధికార స్థానాన్ని స్వాధీనం చేసుకున్నాయి. మాన్యఖేటకు చెందిన రాష్ట్రకూటులు ఉచ్ఛస్థితిలో ఉన్న కాలంలో, ఉత్తరాన గంగా యమునల దోయబ్ నుండి దక్షిణాన కన్యాకుమారి వరకూ ఉన్న విస్తారమైన సామ్రాజ్యాన్ని పరిపాలించారు. రాజకీయ విస్తరణ, నిర్మాణ విజయాలు, ప్రసిద్ధ సాహిత్య రచనల ఫలవంతమైన కాలం అది. ఈ రాజవంశం లోని తొలి రాజులు హిందూ మతాన్ని, తరువాత రాజులు జైనమతాన్నీ అవలంబించారు.
వారి పాలనలో, జైన గణిత శాస్త్రవేత్తలు, పండితులు కన్నడ, సంస్కృతాల్లో ముఖ్యమైన రచనలు చేశారు. ఈ రాజవంశం లోని అత్యంత ప్రసిద్ధ రాజు మొదటి అమోఘవర్షుడు, కన్నడ భాషలో ఒక మైలురాయి సాహిత్య రచన అయిన కవిరాజమార్గ రాశాడు. ద్రావిడ శైలి వాస్తుశైలి ఉచ్ఛస్థితిని చేరుకుంది. దీనికి ఉత్తమ ఉదాహరణ ఆధునిక మహారాష్ట్రలోని ఎల్లోరాలోని కైలాసనాథ్ ఆలయంలో కనిపిస్తుంది. ఇతర ముఖ్యమైన నిర్మాణాలు కాశీవిశ్వనాథ ఆలయం, ఆధునిక కర్ణాటకలోని పట్టడకల్ వద్ద ఉన్న జైన నారాయణ ఆలయం, రెండూ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు .