లక్ష్మీ బ్యారేజి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ / From Wikipedia, the free encyclopedia
లక్ష్మీ బ్యారేజి (మేడిగడ్డ బ్యారేజి) కాళేశ్వరం ఎత్తిపోతల పథకం లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ వద్ద నిర్మించిన బ్యారేజీ.[1] గోదావరి నదిలోని నీటిని తాగునీరు, నీటిపారుదల కోసం ఉపయోగించుకోవడమే ప్రధాన లక్ష్యంగా లక్ష్మీ బ్యారేజి నిర్మించబడింది. దీని పూర్తి నిల్వ నీటి సామర్థ్యం 16.17 టీఎంసీలు.
త్వరిత వాస్తవాలు లక్ష్మీ బ్యారేజి, ప్రదేశం ...
లక్ష్మీ బ్యారేజి | |
---|---|
ప్రదేశం | మేడిగడ్డ, మహాదేవపూర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా |
అక్షాంశ,రేఖాంశాలు | 18°42′13.8″N 80°05′21″E |
స్థితి | వాడుకలో ఉంది |
నిర్మాణం ప్రారంభం | 2016 మే 2 |
ప్రారంభ తేదీ | 2019, జూన్ 21 |
యజమాని | తెలంగాణ ప్రభుత్వం |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
ఆనకట్ట రకం | బ్యారేజి |
నిర్మించిన జలవనరు | గోదావరి నది |
Spillways | 68 |
జలాశయం | |
సృష్టించేది | లక్ష్మీ బ్యారేజి |
మొత్తం సామర్థ్యం | 16.17 టీఎంసీలు |
విద్యుత్ కేంద్రం | |
నిర్వాహకులు | తెలంగాణ రాష్ట్రం |
Type | బ్యారేజి |
మూసివేయి