వాణిశ్రీ
ప్రముఖ సినీ నటి / From Wikipedia, the free encyclopedia
వాణిశ్రీ (జ.1948, ఆగష్టు 3, నెల్లూరు) 1960, 1970 దశకములలో పేరొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగు సినిమాలతో పాటు అనేక తమిళ, కన్నడ, మలయాళ సినిమాలలో కూడా నటించింది. మరపురాని కథ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేసిన వాణిశ్రీ సుఖదుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్రతో మంచి పేరుతెచ్చుకున్నది. ఈ సినిమాలో ఇది మల్లెల వేళయనీ ప్రసిద్ధ పాటను ఈమెపై చిత్రీకరించారు. ఆ తరువాత కథానాయకిగా అనేక సినిమాలో నటించి 1970వ దశకమంతా తెలుగు చిత్రరంగములో అగ్రతారగా నిలచింది. ఈ దశాబ్దపు చివరలో శ్రీదేవి, జయప్రదలు తెరపై వచ్చేవరకు వాణిశ్రీనే అగ్రతార.
త్వరిత వాస్తవాలు వాణిశ్రీ, జననం ...
వాణిశ్రీ | |
---|---|
జననం | రత్నకుమారి (1948-08-03) 1948 ఆగస్టు 3 (వయసు 75) నెల్లూరు, భారతదేశం |
వృత్తి | నటి |
ఎత్తు | 5అ. 6అం. |
మూసివేయి
ఆ తరువాత సినీ రంగమునుండి విరమించి, వాణిశ్రీ పెళ్ళి చేసుకొని సంసారజీవితంలో స్థిరపడింది. ఈమెకు ఒక కొడుకు, ఒక కూతురు. 80వ దశకములో ఈమె తిరిగి తల్లి పాత్రలతో సినీ రంగములో పునః ప్రవేశించింది.