విద్యుత్ లేపనం
From Wikipedia, the free encyclopedia
విద్యుద్విశ్లేషణ ద్వారా ఎక్కువ ధర ఉన్న లోహాలను లేదా, త్వరగా క్షయం కాని లోహాలను ఒక వేరే లోహంపై పచ్లగా పూత పూయటాన్ని "విద్యుత్ లేపనం" అంటారు.దీనిని ఆంగ్లంలో ఎలక్ట్రో ప్లేటింగ్ అంటారు. విద్యుత్ లేపనం ఉపయోగించి లోహపు పూత పూయవలసిన లోహాన్ని కాథోడ్ (ఋణ ధ్రువం) గాను, పూతకు ఉపయోగించే లోహాన్ని ఆనోడు (ధన ధ్రువం) గాను తీసుకుని విద్యుత్ విశ్లేష్యంగా పూతకు అవసరమైన లోహం కలిగియున్న ద్రావణాన్ని తీసుకుని దానిని వలయములో విద్యుత్ ప్రవాహానిని సంధానం చేస్తారు. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో ద్రావణం రెండు అయాన్లుగా (కాటయాన్, ఆనయాన్) గా విడిపోతుంది. కాటయాన్ అనగా ధన అయాన్. ఆనయాన్ అనగా ఋణ అయాన్. ధన అయాన్లు ఋణ పలక అయిన కాథోడ్ పైకి చేరి ఎలక్ట్రాన్లను గ్రహించి లోహపు పూత యేర్పడుతుంది. ఋణ అయాన్లు (ఆనయాన్లు) ధన పలక (ఆనోడు) పైకి చేరి ఆ పలకలో గల పూత పూయుటకు ఉపయోగించే లోహపరమాణువుకు ఎలక్ట్రాన్లను అందించి మరల విద్యుత్ విశ్లేష్యంగా తీసుకున్న ద్రావణ అణువుగా తయారై ద్రావణంలో కలిసి పోతుంది. ఈ ప్రక్రియలో విద్యుత్ విశ్లేష్యం (తీసుకున్న ద్రావణం) యొక్క గాఢత మారదు. కానీ కాథోడ్ నుండి విడుదలయిన ఎలక్ట్రాన్ల సంఖ్య, ఆనోడు గ్రహించిన ఎలక్ట్రాన్ల సంఖ్యకు సమానమవుతుంది. ఈ విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ జరిపే కాలం, ఉపయోగించే విద్యుత్ ప్రవాహం పై పూత ఆధారపది ఉంటుంది. ఎక్కువ సమయం విద్యుద్విశ్లేషణ ప్రక్రియ జరిపినా లేదా, హెచ్చు విద్యుత్ ప్రవాహాన్ని పంపించినా లోహంపై యేర్పడిన పొర మందం పెరుగుతుంది. ఈ ప్రక్రియను కృత్రిమ ఆభరణములపై బంగారుపూత లేదా వెండి పూత వేయుటకు, త్వరగా క్షయం అయిన లోహాలపై క్షయం కాకుండా అరికట్టేందుకు, మలినాలతో కూడిన ఏదైనా లోహం నుండి శుద్ధ లోహం వేరు చేయు విధానంలో లోహ సంగ్రహణ శాస్త్రంలో ఉపయోగిస్తారు., సూక్ష్మ భాగాల్లో దృఢత్వాన్ని పెంచటానికి ఉపయోగిస్తారు.
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |