![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/da/Arhat_Sangamitta_Theri.jpg/640px-Arhat_Sangamitta_Theri.jpg&w=640&q=50)
సంఘమిత్ర
భారతీయ బౌద్ధ సన్యాసిని, అశోక చక్రవర్తి కూతురు / From Wikipedia, the free encyclopedia
సంఘమిత్ర అశోక చక్రవర్తి, అతని మొదటి భార్య దేవి దంపతుల పెద్ద కూతురు. ఆమె సోదరుడు మహేంద్రుడితో కలిసి బౌద్ధ మత వ్యాప్తికై సన్యాసిగా మారింది. వీరిరువురు అప్పటి శ్రీలంక దేశానికి రాజు, అశోకునికి సమకాలికుడైన దేవనంపియా టిస్సా (సా.పూ 250 – సా.పూ 210) అభ్యర్థన మేరకు బుద్ధుని బోధనలు ఆదేశంలో వ్యాప్తి చేయడానికి వెళ్ళారు. ఈమె మొదటగా మతగల్ అనే గ్రామం చేరింది. ఈ గ్రామం హిందూ మహా సముద్ర తీరంలో శ్రీలంక ఉత్తర ప్రాంతంలో ఉన్న జాఫ్నాకు 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆమె తండ్రి అశోక చక్రవర్తి ఆమెను, ఆమెతో పాటు మరికొంతమంది బౌద్ధ సన్యాసినులను అనురాధపుర లోని టిస్సా రాణి అనుల, ఇతర సభాసదులను బౌద్ధ మతావలంబకులుగా చేయమని కోరాడు. అప్పటికే మహేంద్రుడు వారిని బౌద్ధమతంలోకి మార్చి ఉన్నాడు[1][2][3][4][5]
సంఘమిత్ర | |
---|---|
![]() శ్రీలంకలోని ఓ బౌద్ధారామంలో సంఘమిత్ర విగ్రహం | |
ఇతర పేర్లు | సంఘమిత్త (పాళీ భాష) |
వ్యక్తిగతం | |
జననం | సా.పూ 281 ఉజ్జయిని, అశోకుని సామ్రాజ్యం |
మరణం | సా.పూ 202 అనురాధపుర, శ్రీలంక |
చివరి మజిలీ | శ్రీలంక |
మతం | థేరవాద బౌద్ధం |
జాతీయత | భారతీయురాలు |
జీవిత భాగస్వామి | అగ్గిబ్రహ్మ |
సంతానం | సుమనుడు |
తల్లిదండ్రులు | అశోకుడు (తండ్రి) దేవి (తల్లి) |
విద్య | బౌద్ధ మతం |
దీనికి ప్రసిద్ధి | శ్రీలంకలో బౌద్ధ సన్యాసినుల సాంప్రదాయానికి ఆద్యురాలు |
ఇతర పేర్లు | సంఘమిత్త (పాళీ భాష) |
ఆమ సోదరుడు మహేంద్రుడు మొదటగా శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. ఆమె కుమారుడు సుమనుడు కూడా మహేంద్రుడి వెంట వెళ్ళాడు. | |
ఆమ సోదరుడు మహేంద్రుడు మొదటగా శ్రీలంక వెళ్ళి బౌద్ధాన్ని వ్యాప్తి చేశాడు. ఆమె కుమారుడు సుమనుడు కూడా మహేంద్రుడి వెంట వెళ్ళాడు. |
ఆమె శ్రీలంకలో బౌద్ధ మతం వ్యాప్తి చేసి భిక్కుని సంఘాలనే పేరుతో మహిళల కోసం సన్యాసినుల సంప్రదాయాన్ని ప్రారంభించింది. కేవలం శ్రీలంక లోనే కాక బర్మా, చైనా, థాయ్ లాండ్ మొదలైన దేశాలలో కూడా ఇలాంటి సంప్రదాయాలు ఏర్పడ్డానికి ఈమె కృషి చేసింది. శ్రీలంకలోని థేరవాద బౌద్ధ మతవాలంబకులు ఈమె బౌద్ధులు పవిత్రంగా భావించే బోధి వృక్షాన్ని శ్రీలంకలోని అనురాధపురలో నాటిన మొదటి రోజును ప్రతి సంవత్సరంలో డిసెంబరు నెలలో వచ్చే పౌర్ణమి నాడు ఉడువప పోయా లేదా ఉపోసత పోయా అనే పేరుతో పండగ చేసుకుంటారు. [2][4][6]