సంఝౌతా ఎక్స్ప్రెస్
From Wikipedia, the free encyclopedia
సంఝౌతా ఎక్స్ప్రెస్ (హిందీ: समझौता एक्सप्रेस, పంజాబీ భాష: ਸਮਝੌਤਾ ਐਕਸਪ੍ਰੈਸ, ఉర్దూ: سمجھوتا اکسپريس) సాధారణంగా ఫ్రెండ్షిప్ ఎక్స్ప్రెస్ అని పిలుస్తారు. ప్రతి బుధవారం, ఆదివారం భారతదేశం లోని ఢిల్లీ జంక్షన్, అటారీ, పాకిస్తాన్ లోని లాహోర్ స్టేషన్ల మధ్య నడుస్తుంది. సంఝౌతా అనే పదం హిందీ, ఉర్దూ భాష రెండింటిలో "ఒప్పందం", "రాజీ" అని అర్ధం.
అవలోకనం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
చివరిస్థానం | ఢిల్లీ జంక్షన్ లాహోర్ జంక్షన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
స్టేషన్లు | అమృత్సర్ లాహోర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఆపరేషన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నిర్వాహకులు | భారతీయ రైల్వేలు పాకిస్తాన్ రైల్వేలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
సాంకేతికం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|
థార్ ఎక్స్ప్రెస్ పునఃప్రారంభం వరకు, ఇది రెండు దేశాల మధ్య నడిచే ఏకైక రైలు కనెక్షన్గా ఉంది. సిమ్లా ఒప్పందాన్ని అనుసరించి 1976 జూలై 22 న ఈ రైలు ప్రారంభమైంది. అమృత్సర్, లాహోర్ మధ్య 42 కిలోమీటర్ల దూరం ఇది నడిచింది. ఎనభై దశకం చివర్లో పంజాబ్లో అల్లర్లకు గురైన తరువాత, భద్రతా కారణాల వల్ల భారత రైల్వేలు అటారీ వరకు నడిచేందుకు మాత్రమే ఈ రైలు సేవలను పరిమితం చేయాలని నిర్ణయించుకున్నాయి. అటారీ వద్ద కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సులు జరుగుతాయి.