సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు
From Wikipedia, the free encyclopedia
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతానికి చెందిన పౌర పరిపాలనా సంస్థ.[1]ఇది భౌగోళికంగా హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల పరిధిలో ఉంది. భారతదేశంలో మొదటి అతిపెద్ద బతిండా సైనిక నివాసప్రాంత మండలి తరువాత సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి రెండవ అతిపెద్దదిగా గుర్తించబడింది. [2] [3].[4] సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి పరిధిలో నాలుగు లక్షల జనాభాతో, ఎనిమిది పౌర వార్డులును కలిగిఉంది.[5] ప్రధానంగా సైనిక ప్రాంతం కావడంతో, సికింద్రాబాద్ సైనికనివాస ప్రాంతమండలి భారత ప్రభుత్వ కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చింది. ఇది 40.1 కి.మీ2 (15.5 చ. మై.) విస్తీర్ణంపై పరిపాలనను పర్యవేక్షిస్తోంది. [6] ఇక్కడ అనేక సైనిక శిబిరాలు ఉన్నాయి. [7] [8]