సుకుమా జిల్లా
From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్గఢ్ రాష్ట్రం లోని జిల్లాలలో సుకుమ జిల్లా ఒకటి. ఛత్తీస్గఢ్కు దక్షిణాన ఈ జిల్లా ఉంది. ఈ జిల్లా సరిహద్దులలో బస్తరు, దెంతెవాడ, బిజాపూర్ జిల్లాలున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, తెలంగాణ రాష్ట్రాలు కూడా సుకుమా జిల్లాకు ఉన్నాయి. సుకుమ, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని రాయ్పూర్ నుండి 400 కి.మీ. దూరమ్లో ఉంది.
త్వరిత వాస్తవాలు సుకుమ జిల్లా, దేశం ...
సుకుమ జిల్లా | |
---|---|
ఛత్తీస్గఢ్ జిల్లా | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఛత్తీస్గఢ్ |
Area | |
• మొత్తం | 5,897 km2 (2,277 sq mi) |
Time zone | UTC+05:30 (IST) |
మూసివేయి
2012 జనవరి 12 న దెంతెవాడ జిల్లా నుండి కొంత భాగాన్ని విడదీసి ఈ జిల్లాని ఏర్పరచారు. ఉప ఉష్ణమండల అరణ్యాలతో నిండి ఉంటుంది. గిరిజన తెగ అయిన గోండులు ఈ జిల్లాలో ప్రధానంగా ఉంటారు. జిల్లా జనాభాలో 85% పైగా గిరిజనులే. జిల్లా విస్తీర్ణంలో 65% భాగం అడవులే. చ.కి.మీ.కు 45 మంది ప్రజలతో అతి తక్కువ జనసాంద్రత కలిగి ఉంది. 29% అక్షరాస్యతతో దేశంలో కెల్లా అత్యల్ప అక్షరాస్యత గల జిల్లాలో ఇది ఒకటి. శబరి నది, జిల్లా గుండా ప్రవహించే ప్రధానమైన నది.