2012 ఢిల్లీ సామూహిక అత్యాచార ఉదంతం
From Wikipedia, the free encyclopedia
16 డిసెంబరు 2012 న భారత రాజధాని ఢిల్లీలో ఒక వైద్యవిద్యార్థినిని కదులుతున్న బస్సులో ఆరుగురు కర్కశంగా, దారుణంగా ఇనుప కడ్డీతో కొట్టి అత్యాచారం చేశారు. ఆ సంఘటనలో తల, పేగులకు తగిలిన గాయాలతో 13 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు 2012 డిసెంబరు 29 న ఆమె తుదిశ్వాస విడిచారు.
సమయం | 9:54 పిఎమ్ IST (UTC+05:30) |
---|---|
తేదీ | 16 డిసెంబర్, 2012 |
ప్రదేశం | ఢిల్లీ |
ఫలితం | రామ్ సింగ్ (విచారణ కాలంలో మరణించారు); ఇతర పెద్దల ప్రతివాదులు; ఉరి ద్వారా మరణశిక్ష ,. |
మరణాలు | 1 (స్త్రీ బాధితురాలు) 29 డిసెంబర్, 2012 |
గాయపడినవారు | 1 (పురుష బాధితుడు) |
దోషులు | రామ్ సింగ్ ముకేష్ సింగ్ వినయ్ శర్మ పవన్ గుప్తా అక్షయ్ ఠాకూర్ ఒక పేరులేని బాలనేరస్థుడు |
తీర్పు | ముద్దాయి నేరం |
Convictions | రేప్, హత్య, కిడ్నాపింగ్, దోపిడీ, దాడి[1] |
16న సాయంత్రం ఆమె తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తూ ఐదుగురు ప్రయాణికులు ఉన్న బస్సు ఎక్కారు. మద్యం తాగి ఉన్న ఆ ఐదుగురు ఆమెను, ఆమె స్నేహితుడిని ఇనుప కడ్డీతో కొట్టి కదులుతున్న బస్సులోనే గంటకు పైగా అత్యాచారం చేసి చివరకు వారిద్దరిని బస్సులోనుంచి బయటకు తోసేశారు. అటువైపు వెళ్తున్న కొందరు వివస్త్రంగా, అచేతనంగా పడి ఉన్నవారిని చూసి టోల్ ప్లాజా గస్తీ వాహన సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో చేర్చారు. సఫ్దర్జంగ్ ఆస్పత్రిలో ఉదర సంబంధిత పలు శస్త్రచికిత్సలు చేసిన తరువాత ఆమెను వెంటిలేటర్ లో ఉంచారు. 26 డిసెంబరు న మెరుగైన చికిత్స కోసం సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి ఆమెను తరలించారు. 29 డిసెంబరు న ఆమె మరణించారు.
21 డిసెంబరు నాటికి బస్సు డ్రైవర్ తో సహా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనతో దేశవ్యాప్తంగా ప్రజలు నిరసన తెలిపారు. ఢిల్లీలో వేలమంది నిరసనకారులు తమ నిరసన తెలుపగా ఆ నిరసనలో రక్షకభటులతో ఘర్షణ జరిగింది.