![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e2/K2717_Antonov_An.32_Indian_Air_Force_%25288414615752%2529.jpg/640px-K2717_Antonov_An.32_Indian_Air_Force_%25288414615752%2529.jpg&w=640&q=50)
2016 నాటి ఎఎన్-32 విమాన అదృశ్యం
భారతీయ వాయుసేనకు చెందిన విమానం అదృశ్యమైన సంఘటన / From Wikipedia, the free encyclopedia
2016 జూలై 22 న, భారత వైమానిక దళానికి చెందిన ఏంటోనోవ్ ఎఎన్ -32 ట్విన్ ఇంజిన్ టర్బోప్రాప్ రవాణా విమానం బంగాళాఖాతం మీదుగా ఎగురుతున్నప్పుడు అదృశ్యమైంది.[1] ఈ విమానం చెన్నై లోని తాంబరం వైమానిక దళ కేంద్రం నుండి అండమాన్ నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్ వరకు వెళుతోంది. విమానంలో 29 మంది ఉన్నారు. ఉదయం 9:12 గంటలకు, చెన్నై నుండి తూర్పున 280 కి.మీ. దూరాన ఉండగా విమానంతో రాడార్ సంపర్కం కోల్పోయింది.[2][3] సముద్రంలో తప్పిపోయిన విమానాన్ని వెతకడం కోసం భారతదేశం అతి పెద్ద ఆపరేషన్ను చేపట్టింది.[4]1986, 2019 లో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి.
త్వరిత వాస్తవాలు అదృశ్యం సారాంశం, తేదీ ...
మూసివేయి