2022 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు
From Wikipedia, the free encyclopedia
2022 హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు నవంబరు 12న జరిగాయి. ప్రస్తుత శాసనసభ గడువు 2023 జనవరి 8న ముగుస్తుంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను అక్టోబరు 14న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో నవంబరు 12న 68 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగగా, 66 శాతం పోలింగ్ నమోదైంది.[1] డిసెంబరు 8న ఫలితాలు వెలువడ్డాయి.[2] ఈ ఫలితాల్లో మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో, ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు.[3][4][5]