భారతదేశ నకలు హక్కుల చట్టం
From Wikipedia, the free encyclopedia
నకలుహక్కు చట్టం 1957 (Act No. 14 of 1957) భారతదేశంలో నకలహక్కుల విషయంలో చట్టాలు, సంబంధిత సూత్రాలను నిర్ణయిస్తుంది. ఇది యునైటెడ్ కింగ్డమ్ కాపీరైటు యాక్ట్ 1956 పై ఆధారపడింది. దీనికి పూర్వం నకలుహక్కు చట్టం 1914 అమలులో వుండేది. అది ప్రధానంగా బ్రిటీషు కాపీరైటు యాక్ట్ 1911 ను భారతదేశానికి అన్వయించడం వలన ఏర్పడింది[1].
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (జూన్ 2017) |
ఈ చట్టం అంతర్జాతీయ పద్ధతులు, ఒప్పందాలకు అనుగుణంగా ఉంది. 1886 బెర్నే సమావేశం (1971 పారిస్ లో మార్చినట్లుగా),1951 సార్వత్రిక కాపీరైటు సమావేశం, 1995 మేధాఆస్తి హక్కుల వ్యాపార విషయాలపై ఒప్పందాలకు (ట్రిప్స్) (Trade Related Aspects of Intellectual Property Rights (TRIPS) Agreement ) భారతదేశం సభ్యదేశంగా పాల్గొంది. 1961 రోమ్ సమావేశంలో పాల్గొనకపోయినప్పటికి, విపో కాపీహక్కుల ఒప్పందం (WIPO Copyrights Treaty (WCT) ), విపో రికార్డులు, ప్రదర్శనల ఒప్పందం (WPPT) లకు అనుగుణంగా ఉంది.భారతదేశంలో కాపీరైట్ హక్కులను పరిరక్షించడానికి 1958 లో రూపొందించిన బిల్లు.
ఇండియన్ కాపీరైట్ చట్టం 1957 వాణిజ్యీకరణను పెంచడానికి ఉద్దేశించినది కాదు, కానీ రచయితలు, ప్రచురణకర్తలు, వినియోగదారులందరి ప్రయోజనాలలో న్యాయమైన సమతుల్యతను సాధించడం. కంప్యూటర్, ఇంటర్నెట్ మొదలైన సాంకేతిక మార్గాల ఈ యుగంలో రచయితలు, ప్రచురణకర్తల హక్కులను పరిరక్షించడానికి, దీనిని సవరించడానికి కాపీరైట్ హక్కుల సవరణ లేఖ 2010 ను తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది[2].
భారతదేశంలో ఇప్పటివరకు ఏడు సార్లు సవరించబడింది. (1957,1983,1984,1992,1994,2010, 2012)
సెక్షన్ 51 కి దాని అనుమతి అవసరం. ఇది షరతులు లేకుండా ఉల్లంఘనగా పరిగణించబడుతుంది కాని కాపీరైట్ యజమానికి కాపీ హక్కు కూడా ఉండాలి. ఈ చట్టం వార్తాపత్రికలో వర్తించదు