అశ్వాపురం మండలం
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
అశ్వాపురం మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం.[1].ఇది గొల్లగూడెం గ్రామ పంచాయితీలోని ఒక గ్రామం.ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం భద్రాచలం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం అశ్వాపురం.
Remove ads
గణాంకాలు

భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మండల జనాభా- మొత్తం 43,067 - పురుషులు 21,757 - స్త్రీలు 21,310
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 582 చ.కి.మీ. కాగా, జనాభా 59,652. జనాభాలో పురుషులు 29,963 కాగా, స్త్రీల సంఖ్య 29,689. మండలంలో 15,775 గృహాలున్నాయి.[3]
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
లోగడ అశ్వాపురం మండలం,ఖమ్మం జిల్లా, భద్రాచలం రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అశ్వాపురం మండలాన్ని (1+10) 11 గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా, పాల్వంచ రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
Remove ads
మండలం లోని గ్రామాలు
రెవెన్యూ గ్రామాలు
- అశ్వాపురం
- కుమ్మరిగూడెం
- అమ్మగారిపల్లి
- పాములపల్లి
- అమెర్ల
- గందిగూడెం
- చింత్రియాల
- నెల్లిపాక
- మామిళ్ళవాయి
- తుమ్మలచెరువు
గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads