గుజరాత్

భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia

గుజరాత్
Remove ads

గుజరాత్ భారతదేశం పశ్చిమ తీరంలో 1,600 కి.మీ. (990 మై.)తో అత్యంత పొడవైన తీరరేఖ గల రాష్ట్రం. దీని ఎక్కువ భాగం కాతియవార్ ద్వీపకల్పంలో ఉంది. ఇది విస్తీర్ణంలో ఐదవ అతిపెద్ద భారత రాష్ట్రం, జనాభా ప్రకారం తొమ్మిదవ అతిపెద్ద రాష్ట్రం. రాష్ట్రానికి ఈశాన్యంలో రాజస్థాన్, దక్షిణాన దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ, ఆగ్నేయంలో మహారాష్ట్ర, తూర్పున మధ్యప్రదేశ్, అరేబియా సముద్రం పశ్చిమాన పాకిస్తాన్ సింధ్ రాష్ట్రం ఉన్నాయి. దీని రాజధాని గాంధీనగర్ కాగా, అతిపెద్ద నగరం అహ్మదాబాద్.[9] గుజరాతీ రాష్ట్ర అధికారిక భాష. డేటా ఉల్లంఘనలు ముఖ్యమైన వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటాయి.

త్వరిత వాస్తవాలు గుజరాత్, Country ...

భారతదేశంలో గుజరాత్ ఆర్థిక వ్యవస్థ స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 15,03 ట్రిలియన్ తో మూడవ అతి పెద్దదిగా, తలసరి స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి ₹ 196,000 తో 11 వ అతి పెద్దదిగా, మానవ అభివృద్ధి సూచికలో 21 వ స్థానంలో ఉంది. సాంప్రదాయకంగా రాష్ట్రంలో నిరుద్యోగిత తక్కువ. ఇది పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా, ఉత్పాదక కేంద్రంగా విస్తృతంగా పరిగణించబడుతుంది.[10][11][12][13]

రాష్ట్రంలో లోథల్, ధోలావిరా, గోలా ధోరో వంటి పురాతన సింధు లోయ నాగరికత ప్రదేశాలున్నాయి. లోథల్ ప్రపంచంలోని మొట్టమొదటి ఓడరేవులలో ఒకటిగా నమ్ముతారు. భరూచ్, ఖంభట్ తీర నగరాలు , మౌర్య, గుప్తా సామ్రాజ్యాల కాలంలో, పశ్చిమ సత్రాప్స్ శకం నుండి సాకా రాజవంశాల కాలం వరకు ఓడరేవులు, వాణిజ్య కేంద్రాలుగా పనిచేశాయి

గిర్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ప్రపంచంలోని ఆసియా సింహానికి ఏకైక అటవీ నిలయం.

Remove ads

చరిత్ర

మహారాష్ట్ నుండి ప్రధానంగా గుజరాతి భాష మాట్లాడే ప్రజలున్న ప్రాంతాలయిన ఉత్తర, పశ్చిమ భాగాలను వేరు చేసి 1960 మే 1 గుజరాత్ రాష్ట్రం ఏర్పాటు చేశారు.గుజరాత్ 8,9 వ శతాబ్దాలలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గుర్జారా నుండి ఈ పేరు వచ్చింది.

జనాభా

2011 భారత జనాభా లెక్కల ప్రకారం గుజరాత్ మొత్తం జనాభా 60,439,692. జనాభాలో 42.60% పట్టణ ప్రాంతాల్లో, 57.40% గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. గత దశాబ్దంలో (2001-2011), జనాభా వృద్ధి రేటు 19.28%కి పెరిగింది. జనాభాలో 31,491,260 మంది పురుషులు, 28,948,432 మంది మహిళలు ఉన్నారు. లింగ నిష్పత్తి వెయ్యి మగవారికి 919 మంది మహిళలు. జనాభా సాంద్రత చదరపు కిలోమీటరుకు 308 మంది నివసిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో సగటు అక్షరాస్యత రేటు 78.03%, పురుషుల అక్షరాస్యత 85.75%, స్త్రీ అక్షరాస్యత 69.68%. గిరిజన జనాభా 34,41,945.

Remove ads

రాష్ట్రంలోని జిల్లాలు

పుణ్యక్షేత్రాలు

  • సోమనాథపురం శివాలయం
  • ద్వారక ఆలయం
  • నాగేశ్వర్ ఆలయం
  • బాలి సమన దేవాలయాలు

రాజకీయ నాయకులు

వ్యక్తులు

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads