పి.బి. గజేంద్రగడ్కర్
భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి From Wikipedia, the free encyclopedia
Remove ads
ప్రహ్లాద్ బాలాచార్య గజేంద్రగడ్కర్ (1901, మార్చి 16 - 1981, జూన్ 12) భారతదేశ సుప్రీంకోర్టు ఏడవ ప్రధాన న్యాయమూర్తి. 1964 ఫిబ్రవరి 1 నుండి 1966 మార్చి 15 వరకు పనిచేశాడు.
Remove ads
జననం
గజేంద్రగడ్కర్ 1901, మార్చి 16న మహారాష్ట్రలోని సతారా జిల్లా ముఖ్యపట్టణమైన సతారాలో దేశస్థ మాధ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు.[1] తండ్రిపేరు గజేంద్రగడ్కర్ బాలాచార్య. ఇతని కుటుంబం, కర్ణాటక, ధార్వాడ్ జిల్లాలోని గజేంద్రగడ్ అనే పట్టణం నుండి సతారాకు వలస వచ్చింది.[2][3] గజేంద్రగడ్కర్ తండ్రి బాలాచార్య ఉపాధ్యాయుడు, సంస్కృత పండితుడు.
చదువు
- సతారా హై స్కూల్ (1911-1918)
- కర్ణాటక కళాశాల, ధార్వార్ (1918–1920)
- దక్కన్ కళాశాల (పూణె) (1920-1924)
- దక్షిణ ఫెలో (1922–24)
- భగవందాస్ పురుషోత్తమదాస్ సంస్కృత పండితుడు (1922–24)
- ఐఎల్ఎస్ న్యాయ కళాశాల (1924–26)
న్యాయవృత్తి
గజేంద్రగడ్కర్ 1945లో బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యాడు. 1956 జనవరిలో సుప్రీంకోర్టు బెంచ్కు పదోన్నతి పొందాడు. 1964లో భారత ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందాడు. రాజ్యాంగ, పారిశ్రామిక చట్టం అభివృద్ధికి ఆయన చేసిన కృషి గొప్పది, విశిష్టమైనదిగా ప్రశంసించబడింది.
పాయ్ దాఖలు చేసిన కేసు ప్రకారం 60 ఏళ్ళ వయస్సులో నిర్బంధ పదవీ విరమణ చేయకుండా ఉండటానికి తన పుట్టిన తేదీని ఫోర్జరీ చేసినట్లు లాయర్ జి. వసంత పాయ్ రుజువుకావడంతో గజేంద్రగడ్కర్ జోక్యం చేసుకుని అప్పటి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్. రామచంద్ర అయ్యర్ను రాజీనామా చేయించాడు.[4]
భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు సెంట్రల్ లా కమిషన్, నేషనల్ కమీషన్ ఆన్ లేబర్, బ్యాంక్ అవార్డ్ కమిషన్ వంటి అనేక కమీషన్లకు నాయకత్వం వహించాడు. అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ అభ్యర్థన మేరకు దక్షిణ భారతదేశంలోని గాంధీగ్రామ్ రూరల్ ఇన్స్టిట్యూట్ గౌరవ కార్యాలయాన్ని కూడా నిర్వహించాడు. రెండుసార్లు సాంఘిక సంస్కరణ సదస్సుకు అధ్యక్షుడిగా పనిచేశాడు. జాతీయ సమైక్యత, ఐక్యతను పెంపొందించడానికి కులతత్వం, అంటరానితనం, మూఢనమ్మకాలు, అస్పష్టత చెడులను నిర్మూలించడానికి ప్రచారం చేశాడు. గజేంద్రగడ్కర్ వేదాంత, మీమాస మాధ్వ సంప్రదాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాడు. భారతీయ విద్యాభవన్ స్పాన్సర్ చేసిన 'ది టెన్ క్లాసికల్ ఉపనిషడ్స్' అనే ధారావాహికకు జనరల్ ఎడిటర్గా పనిచేశాడు.
నిర్వర్తించిన పదవులు
- బాంబే హైకోర్టు న్యాయమూర్తి (1945–57)
- సుప్రీంకోర్టు న్యాయమూర్తి (1957)
- భారత ప్రధాన న్యాయమూర్తి (1964 ఫిబ్రవరి 1 - 1966 మార్చి 15)
- ముంబయి విశ్వవిద్యాలయం గౌరవ వైస్-ఛాన్సలర్ (1967)
పుస్తకాలు
- ఓపెన్ లైబ్రరీ పిబి గజేంద్రగడ్కర్[5]
అవార్డులు
- 1972: భారత ప్రభుత్వం నుండి పద్మవిభూషణ్ అవార్డు
మరణం
గజేంద్రగడ్కర్ 1981, జూన్ 12న ముంబైలో మరణించాడు.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads