విఠల్‌రావు దేశపాండే

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే From Wikipedia, the free encyclopedia

Remove ads

విఠల్‌రావు దేశపాండే తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.

త్వరిత వాస్తవాలు నియోజకవర్గం, వ్యక్తిగత వివరాలు ...
Remove ads

జననం

విఠల్‌రావు దేశపాండే 1932 ఫిబ్రవరి 1 తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాదు జిల్లా, ఆదిలాబాద్‌లో జన్మించాడు.[1]

రాజకీయ జీవితం

విఠల్‌రావు దేశపాండే 1957 నుంచి 1962 వరకు సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన 1962లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సి.పి.ఐ అభ్యర్థి కె.రామకృష్ణ పై గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.

ఆయన 1968లో కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. విఠల్‌రావు దేశపాండే 1968 నుంచి 1972 వరకు ఆంధ్రప్రదేశ్‌ షుగర్‌బోర్డు చైర్మన్‌గా, 1972 నుంచి 1978 వరకు డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌గా రెండు పర్యాయాలు పనిచేసి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి, 1978 నుంచి 1981 వరకు జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు.

Remove ads

మరణం

విఠల్‌రావు దేశపాండే అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నాంపల్లి కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 28 జూలై 2016న మరణించాడు. ఆయనకు నలుగురు కుమారులు రి డాక్టర్‌ దేవిదాస్‌ దేశ్‌పాండే, వినోద్‌కుమార్‌ దేశ్‌పాండే, విశ్వాస్‌ దేశ్‌పాండే, సతీష్‌ దేశ్‌పాండే ఉన్నారు.[2]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads