సదాశివపేట

సంగారెడ్డి జిల్లాలోని పట్టణం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం From Wikipedia, the free encyclopedia

Remove ads

సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం.[1]

త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 17.6160739°N 77.9184819°E /, రాష్ట్రం ...

ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.

Remove ads

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గణాంకాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672

2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[3] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[4]

మండలంలోని పట్టణాలు

  • సదాశివపేట (M+OG)

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads