సదాశివపేట
సంగారెడ్డి జిల్లాలోని పట్టణం, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం From Wikipedia, the free encyclopedia
Remove ads
సదాశివపేట, తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు చెందిన పట్టణం.[1]
ఇది పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.1954లో స్థాపితమైన ఈ పురపాలక సంఘం మూడవ శ్రేణి పురపాలక సంఘంగా కొనసాగుతోంది. హైదరాబాదుకు పశ్చిమాన 68 కిమీ దూరంలో జాతీయ రహదారిపై ఉన్న సదాశివపేట పట్టణం 77° 57’ తూర్పు రేఖాంశం, 17° 37’ ఉత్తర అక్షాంశంపై ఉపస్థితియై ఉంది.
Remove ads
జిల్లాల పునర్వ్యవస్థీకరణలో
2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]
గణాంకాలు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 94,337 - పురుషులు 47,665 - స్త్రీలు 46,672
2001 నాటికి పట్టణ జనాభా 36,334 కాగా, 2011 నాటికి 42,809కు పెరిగింది.2014 మార్చి నాటికి వార్డుల సంఖ్య 23, ఓటర్ల సంఖ్య 29255.[3] పట్టణ విస్తీర్ణం 24.4 చకిమీ. 2010లో పారిశుద్ధ్యం విషయంలో ఈ పురపాలక సంఘం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డు పొందింది.[4]
మండలంలోని పట్టణాలు
- సదాశివపేట (M+OG)
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads