సరయు
From Wikipedia, the free encyclopedia
Remove ads
సరయు నది, ఉత్తరాఖండ్లో ఉద్భవించి ఉత్తర ప్రదేశ్ గుండా ప్రవహించే నది. ఇది శారదా నది ఉపనది.వేదాలలో, రామాయణంలో ఈ నది ప్రస్తావించబడింది. ఇది గంగానదికి ఉపనది. ఇది అయోధ్య పట్టణాన్ని ఆనుకొని ప్రవహిస్తుంది. ఈ నదిలోనే శ్రీరామలక్ష్మణులు మునిగి అవతారాలు చాలించారని నమ్ముతారు.ఈ నదిని గోగ్రానది అని కూడా అంటాు.ఈ నది బీహార్ లోని రావెల్గంజ్ వద్ద గంగా నదిలో కలుస్తుంది.
Remove ads
ప్రవాహ తీరు
సరయు నది ఉత్తరాఖండ్ జిల్లా బాగేశ్వర్ జిల్లాకు ఉత్తరాన ఉన్న సర్ముల్ (లేదా సర్మూల్) వద్ద నంద కోట్ శిఖరం దక్షిణాన ఏటవాలుగా వుండే ప్రాంతంలో నది ఉదృత పెరుగుతుంది.ఇది కుమావున్ హిమాలయాల గుండా ప్రవహిస్తుంది, పంచేశ్వర్ వద్ద శారదా నదిలోకి ప్రవహించే ముందు కప్కోట్, బాగేశ్వర్, సెరాఘాట్ పట్టణాల గుండా వెళుతుంది.[1]
శబ్దవ్యుత్పత్తి శాస్త్రం
సరయు పేరు సంస్కృత మూలం సర్ "ప్రవహించే" స్త్రీలింగ ఉత్పన్నం. పురుష , సరయు- అంటే "గాలి" అనగా "ప్రసారం చేసేది" అనే అర్థాన్ని సూచిస్తుంది.
ఇతర వాటికి ఉన్న ఈ పేరు
- భారతీయ రచయిత ఆర్.కె.నారాయణ్ సృష్టించిన కాల్పనిక పట్టణం మాల్గుడి ద్వారా ప్రవహించే నది పేరు సరయు.
- అమెరికన్ నవలా రచయిత విలియం పి. యంగ్ సృష్టించిన "ది షాక్ " రచించిన పుస్తకంలో పవిత్రాత్మ వ్యక్తిత్వానికి ఇచ్చిన పేరు సరయు.
ఇది కూడ చూడు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads