ప్రయాగ్రాజ్
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని నగరం / From Wikipedia, the free encyclopedia
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న నగరమే ప్రయాగ్ రాజ్. ఈ నగరానికి మరొక పేరు అలహాబాద్. ప్రయోగ్ రాజ్ జిల్లాకు ఇది ప్రధానకేంద్రం. ఉత్తర ప్రదేశ్ నగరాలలో జనసాంద్రతలో అలహాబాద్ 7వ స్థానంలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి అలహాబాద్ నగరం, జిల్లా ప్రాంతంలో జనసంఖ్య 17.4 లక్షలు. ప్రపంచంలో అత్యంతవేగంగా అభివృద్ధిచెందుతున్న నగరాలలో అలహాబాద్ 130వ స్థానంలో ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబద్ అతిపెద్ద వాణిజ్య కేంద్రం. తలసరి ఆదాయంలో 2వ స్థానం, జి.డి.పిలో మూడవస్థానంలో ఉంది. అలహాబాదు నగరానికి ప్రధానమంత్రుల నగరమన్న ఖ్యాతి ఉంది. భారతదేశ 13 మంది ప్రధానమంత్రులలో 7 మంది (జవహర్ లాల్ నెహ్రు, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, గుల్జారీ లాల్ నందా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్) ప్రధానమంత్రులు అలహాబాదు వాసులే. వీరంతా అలహాబాదులో జన్మించడం, అలహాబాదు విశ్వవిద్యాలయంలో చదువుకోవడం లేక అలహాబాదు నుండి పార్లమెంటుకు ఎన్నిక కావడం జరిగాయి.
ప్రయాగరాజ్ (అలహాబాదు)
అలహాబాద్ (అలహాబాదు) | |
---|---|
Metropolis | |
Nickname(s): | |
Coordinates: 25°26′09″N 81°50′47″E | |
Country | India |
రాష్ట్రం | Uttar Pradesh |
Division | Prayagraj |
District | Prayagraj |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Prayagraj Municipal Corporation |
• Mayor | Ganesh Kesarwani (BJP) |
Area | |
• Total | 365 km2 (141 sq mi) |
Elevation | 98 మీ (322 అ.) |
Population (2020-2011 hybrid)[3] | |
• Total | 15,36,218 |
• Rank | 36th |
• Density | 4,200/km2 (11,000/sq mi) |
• Metro rank | 40th |
Demonym(s) | Allahabadi Ilahabadi[4] |
Language | |
• Official | Hindi[5] |
• Additional official | Urdu[5] |
• Regional | Awadhi[6] |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
పిన్ కోడ్ | 211001–211018 |
Telephone code | +91-532 |
Vehicle registration | UP-70 |
Sex ratio | 852 ♀/1000♂ |
నగరానికి అసలు పేరు ప్రయాగ. ప్రయాగ అంటే నదీసంగమ ప్రదేశం అని ఒక అర్థం ఉంది. వాస్తవంగా దీనిని త్రివేణిసంగమం అని కూడా అంటారు. పవిత్ర గంగా, యమున, సరస్వతీ నదుల సంగమప్రదేశమే ప్రయాగ. హిందూపురాణాలలో అతిపురాతనమైనది పవిత్రనగరమైనది అయిన ప్రయాగకు ప్రాముఖ్యం అధికం. ప్రయాగలో పలు ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు ఉన్నాయి. అలహాబాదు ఉత్తరప్రదేశ్ దక్షిణప్రాంతంలో ఉంది. అలహాబాదు ఉత్తరదిశలో ప్రతాప్ ఘర్, తూర్పు దిశలో బధోహి, దక్షిణదిశలో రేవా, పడమర దిశలో కౌశంబి ఉంది. నగరవైశాల్యం మొత్తం 63.07 చదరపు కిలోమీటర్లు. అలహాబాదు నగరానికి పలు శివారుప్రాంతాలు ఉన్నాయి. నగరం, పరిసరప్రాంతాలు పలు పురపాలక సంఘాల నిర్వహణలో ఉన్నాయి. అల్షాబాదు జిల్లాలోని అధిక భూభాగం నగరపాలక నిర్వహణలో ఉంది. అలహాబాదు వాసులను అలహాబాదీ అని అంటారు.
అలహాబాదును హస్థినాపుర రాజైన కౌసుంబి స్థాపించాడు. ఇప్పుడు కౌసుంబి ప్రత్యేక రాష్ట్రంగా ఉంది. కౌసుంబి ఈ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు. ప్రయాగ తరచుగా డోయబ్ ప్రాంతంలో సాంస్కృతిక, రాజకీయ రాజధానిగా ఉంటూ వచ్చింది. మొదట కౌసుంబి తరువాత ప్రతిష్ఠాన పురం అని పిలువబడుతూ వచ్చింది. ఆ తరువాత మొఘల్ చక్రవర్తి అయిన అక్బర్ ఈ నగరానికి అలహాబాదు అని నామకరణం చేసి తరువాత దీనిని తన రాజ్యంలో ప్రధాన రాజకీయ కేంద్రం చేసాడు. అభివృద్ధి చెందుతున్న నగరంగా ఇక్కడ పలు కళాశాలలు పరిశోధనా సంస్థలు స్థాపించబడ్డాయి. అలహాబాదు ప్రధాన ఆదాయం పర్యాటకం అయినప్పటికీ నగర ప్రధాన ఆదాయవనరుగా ఆర్థికసేవలు, భూముల క్రయవిక్రయాల నుండి లభిస్తున్నది.