ఆపరేషన్ ఎంటెబీ
హైజాకర్లు బందీలుగా పట్టుకున్న తమ పౌరులను విడిపించేందుకు ఇజ్రాయిల్ చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక / From Wikipedia, the free encyclopedia
ఆపరేషన్ ఎంటెబీ అనేది ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడిఎఫ్) విజయవంతంగా జరిపిన ఉగ్రవాద వ్యతిరేక చర్య. ఈ ఆపరేషన్ను 1976 జూలై 4 న ఉగాండా లోని ఎంటెబీ విమానాశ్రయంలో జరిపారు.[6] అంతకు ఒక వారం ముందు, జూన్ 27న, ఎయిర్ ఫ్రాన్స్కు చెందిన విమానాన్ని పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్టైన్ - ఎక్స్టర్నల్ ఆపరేషన్స్ (PFLP-EO) అనే సంస్థకు చెందిన ఇద్దరు సభ్యులు, వాదీ హద్దాద్ ఆదేశానుసారం,[7] జర్మన్ రివల్యూషనరీ సెల్స్ కు చెందిన ఇద్దరు సభ్యులతో కలిసి హైజాక్ చేసారు. 240 మంది ప్రయాణీకులను బందీలుగా పట్టుకున్నారు. బందీల విడుదల జరగాలంటే ఇజ్రాయిల్ జైళ్ళలో ఉన్న పాలస్తీనా ఉగ్రవాదులు, సంబంధిత ఇతర ఉగ్రవాదులు 40 మందిని, మరి నాలుగు ఇతర దేశాల్లో ఖైదీలుగా ఉన్న 13 మంది ఉగ్రవాదులనూ విడిపించాలని షరతు విధించారు.
ఆపరేషన్ ఎంటెబీ | |||||||
---|---|---|---|---|---|---|---|
అరబ్ ఇజ్రాయిల్ ఘర్షణలో భాగము | |||||||
ఆపరేషన్ తర్వాత సాయెరెట్ మట్కల్కు చెందిన ఇజ్రాయెల్ కమాండోలు | |||||||
| |||||||
ప్రత్యర్థులు | |||||||
Israel |
| ||||||
సేనాపతులు, నాయకులు | |||||||
బలం | |||||||
సుమారు100 మంది కమాండోలు, విమాన సిబ్బంది, సహాయక సిబ్బంది. | 7 గురు హైజాకర్లు. +100 మంది ఉగాండా సైనికులు | ||||||
ప్రాణ నష్టం, నష్టాలు | |||||||
ఒకరు మరణించారు 5 గురు గాయపడ్డారు | హైజాకర్లు: 7 గురు మరణించారు ఉగాండా: 45 మంది మరణించారు[2] 11–30 విమానాలు ధ్వంసమయ్యాయి[3] | ||||||
ముగ్గురు బందీలు హతులయ్యారు[4][5] 10 మంది బందీలు గాయపడ్డారు |
ఇజ్రాయిల్లోని టెల్ అవీవ్ లో బయల్దేరి పారిస్ వెళ్ళవలసిన విమానం, దారిలో ఏథెన్స్ లో ఆగి, తిరిగి బయల్దేరింది. ప్యారిస్కు వెళ్ళవలసిన ఈ విమానాన్ని హైజాకర్లు దారి మళ్ళించి, బెంఘాజి మీదుగా ఉగాండాకు లోని ఎంటెబీకి తరలించారు. ఉగాండా ప్రభుత్వం హైజాకర్లకు మద్దతు పలికింది. ఉగాండా అధ్యక్షుడు, ఇదీ అమీన్ స్వయంగా వారికి స్వాగతం పలికాడు. బందీలను విమానం నుండి విమానాశ్రయం లోని ఒక ఖాళీ భవనంలోకి తరలించారు. వారిలో ఇజ్రాయిలీలను, ఇజ్రాయిలేతరులైన యూదులనూ విడదీసి వారిని వేరే గదిలోకి తరలించారు.[4][5] తరువాతి రెండు రోజుల్లో 148 మంది ఇతర బందీలను విడుదల చేసి పారిస్ కు పంపించారు. 94 మంది ఇజ్రాయిలీ ప్రయాణీకులు, ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 12 మంది సిబ్బందీ బందీలుగా ఉండిపోయారు.
తమ డిమాండ్లను అంగీకరించకపోతే బందీలను చంపేస్తామని హైజాకర్లు బెదిరించారు. ఈ బెదిరింపే బందీలను కాపాడే ఆపరేషన్ కు దారితీసింది.[8] ఇజ్రాయిల్ గూఢచార సంస్థ మొస్సాద్ అందించిన సమాచారం ఆధారంగా, ఐడిఎఫ్ చర్యలు చేపట్టింది. ఉగాండా సైనిక బలగాలను ఎదుర్కోవాల్సి వచ్చే పరిస్థితిని కూడా వారు తమ ప్రణాళికలో చేర్చుకున్నారు.[9]
ఈ ఆపరేషను రాత్రి వేళ జరిగింది. దీని కోసం ఇజ్రాయిలీ రవాణా విమానాలు 100 మంది కమాండోలను 4000 కిలోమీటర్ల దూరంలోని ఉగాండాకు తరలించాయి. వారం రోజుల పాటు ప్లానింగు చేసిన ఈ ఆపరేషన్ 90 నిముషాల లోపే ముగిసింది. 102 మంది బందీలను విడిపించారు. ఐదుగురు ఇజ్రాయిలీ కమాండోలు గాయపడ్డారు. దళ నాయకుడైన లెఫ్టెనెంట్ కలనల్ యొనాటన్ నెతన్యాహు మరణించాడు. హైజాకర్లందరూ మరణించారు. ముగ్గురు బందీలు, 45 మంది ఉగాండా సైనికులూ కూడా మరణించారు. ఇజ్రాయిలీ దళం ఉగాండా ఎయిర్ ఫోర్స్ కు చెందిన మిగ్-17, మిగ్-21 యుద్ధ విమానాలు పదకొండింటిని[4][5] ధ్వంసం చేసింది.[3]
ఈ ఆపరేషన్లో కెన్యా సైనిక బలగాలు ఇజ్రాయిల్కు సాయం చేసాయి. ఇందుకు ప్రతీకారంగా ఇదీ అమీన్ ఉగాండాలో ఉన్న వందలాది మంది కెన్యా జాతీయులను ఊచకోత కోసాడు. [10]
ఆపరేషన్ థండర్బోల్ట్ అనే మిలిటరీ సంకేత నామం కలిగిన ఎంటెబీ ఆపరేషన్ను, అందులో ప్రాణం కోల్పోయిన యొనాటన్ నెతన్యాహు స్మృతిలో ఆపరేషన్ యొనాటన్ అని కూడా పిలుస్తారు. అతను, తదనంతర కాలంలో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి ఐన బెంజమిన్ నెతన్యాహుకు స్వయానా అన్నయ్యే.[11]