ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
రాయలసీమలో బ్రిటిషు వారిని ఎదిరించిన పాళెగాడు / From Wikipedia, the free encyclopedia
1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. 1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన మరణంతో ముగిసింది. రాయలసీమలో రాయలకాలం నుండి పాలెగాళ్ళు ప్రముఖమైన స్థానిక నాయకులుగా ఉండేవారు. అట్లాంటి వారిలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఒకడు. కంపెనీ దొరతనాన్ని ఎదిరించి వీరమరణం పొందాడు.
త్వరిత వాస్తవాలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, జననం ...
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి | |
---|---|
జననం | ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలు జిల్లాలోని రూపనగుడి |
మరణం | ఫిబ్రవరి 22, 1847 |
మరణ కారణం | ఉరి |
ఇతర పేర్లు | ఉయ్యాలవాడ నరసింహారెడ్డి |
ప్రసిద్ధి | బ్రిటిషు వ్యతిరేఖ తిరుగుబాటుదారుడు |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | ముగ్గురు భార్యలు. పెద్దభార్య సిద్దమ్మ |
పిల్లలు | దొర సుబ్బయ్య |
తండ్రి | పెదమల్లారెడ్డి |
మూసివేయి