ఐశ్వర్య రాయ్
భారతీయ నటి / From Wikipedia, the free encyclopedia
ఐశ్వర్య రాయ్ (జననం 1 నవంబరు 1973), ప్రముఖ భారతీయ నటి, మాజీ ప్రపంచ సుందరి. 1994వ సంవత్సరంలో విశ్వసుందరిగా ఎంపికయ్యారామె. ఆమె ఎన్నో సినిమాల్లోనూ యాడ్ లలోనూ నటించారు. ఫిలింఫేర్ పురస్కారాల నామినేషన్ తో పాటు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు ఐశ్వర్య. 2009లోభారత ప్రభుత్వం ఆమెను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. ప్రపంచంలోని అత్యంత అందమైనవారిలో ఒకరిగా ఐశ్వర్యను పేర్కొంటుంటారు.[1][2][3][4][5]
ఐశ్వర్యారాయ్ | |
---|---|
జననం | (1973-11-01) 1973 నవంబరు 1 (వయసు 50) మంగళూరు, కర్ణాటక, భారతదేశం |
జాతీయత | భారతీయులు |
విద్యాసంస్థ | ముంబాయి విశ్వవిద్యాలయం |
వృత్తి | సినిమానటి, మోడాల్ |
క్రియాశీల సంవత్సరాలు | 1994–ప్రస్తుతం |
బిరుదు | 1994 మిస్ వరల్డ్ |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | 1 |
పురస్కారాలు | పూర్తి జాబితా |
సన్మానాలు |
|
సంతకం | |
ఆమె కాలేజీలో చదువుకునేప్పటినుంచే మోడలింగ్ చేసేవారు. కొన్ని టీవీ ప్రకటనల్లోనూ నటించిన ఆమె, మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని సంపాదించుకున్నారు. 1994లో మిస్ వరల్డ్ పోటీల్లో విజేత అయ్యి విశ్వసుందరిగా నిలిచారు. ఆ తరువాత ఆమె సినిమాల్లో నటించడం మొదలుపట్టారు. 1997లో తమిళ సినిమా ఇరువర్ (ఇద్దరు) తో తెరంగేట్రం చేశారు ఐశ్వర్య. అదే సంవత్సరం హిందీలో ఔర్ ప్యార్ హో గయా సినిమాలో నటించారు. తమిళ్ లో నటించిన జీన్స్ (1998) సినిమాతో మొదటి హిట్ అందుకున్నారు ఐశ్వర్య. హమ్ దిల్ దే చుకే సనమ్ (1999), దేవదాస్ సినిమాల్లోని నటనకుగానూ ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారాలు అందుకున్నారు. ఆమె నటించిన బెంగాలీ సినిమా చొఖెర్ బలి (2003), రెయిన్ కోట్ (2004), బ్రిటిష్ చిత్రం ప్రొవొక్డ్ (2006) సినిమాల్లోని నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మొహొబ్బతె (2000), ధూమ్2 (2006), జోధా అక్బర్ (2008), ఎంథిరన్ (2010 (రోబో) ) సినిమాలు ఆమె కెరీర్ లోనే అతిపెద్ద హిట్ లుగా నిలిచాయి. గుజారిష్ (2010) సినిమాలో నటనకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. ఆ తరువాత ఆమె సినిమాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2015లో జజ్బా సినిమాతో తిరిగి రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
2007లో ఐశ్వర్య ప్రముఖ బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు. వారికి ఒక పాప ఆరాధ్య. ఆమె ఎన్నో స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తారు. ఎయిడ్స్ గురించి ప్రచారం చేసే జాయింట్ యునైటెడ్ నేషన్స్ ప్రోగ్రాం (యు.ఎన్.ఎ.ఐ.డి.ఎస్) కు ఆమె ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు జ్యూరీ మెంబర్ గా వ్యవహరించిన మొట్టమొదటి భారతీయ నటి ఐశ్వర్య. 2003లో ఫిలిం ఫెస్టివల్ కు ఆమె జ్యూరీ మెంబర్ గా చేశారు.