కళింగ (చారిత్రక భూభాగం)
భారతదేశపు చారిత్రక ప్రాంతం / From Wikipedia, the free encyclopedia
భారతదేశపు చారిత్రక ప్రాంతంలో కళింగ ఒకటి. ఇది సాధారణంగా మహానది, గోదావరి నదుల మధ్య తూర్పు తీర ప్రాంతంగా నిర్వచించబడింది. అయినప్పటికీ దాని సరిహద్దులు దాని వైవిధ్యమైన పాలకుల పాలనలో భూభాగ వైశాల్యం హెచ్చుతగ్గులకు గురైంది. కళింగ ప్రధాన భూభాగంలో ప్రస్తుత విస్తారమైన ఒడిశా భాగం, ఆంధ్రప్రదేశు ఉత్తర భాగాన్ని అంతర్భాగంగా ఉన్నాయి. దాని శిఖరాగ్రస్థాయిలో కళింగ ప్రాంతం ప్రస్తుత ఛత్తీసుగఢులో కొంత భాగాన్ని కూడా కలిగి ఉంది.
పురాణ గ్రంథమైన మహాభారతంలో కళింగాలను ప్రధాన తెగగా పేర్కొన్నారు. క్రీస్తుపూర్వం 3 వ శతాబ్దంలో కళింగ యుద్ధం ఫలితంగా ఈ ప్రాంతం మౌర్య నియంత్రణలోకి వచ్చింది. దీనిని తరువాత అనేక ప్రాంతీయ రాజవంశాలు పాలించాయి. దీని పాలకులు కళింగాధిపతి ("లార్డు ఆఫ్ కళింగ") అనే బిరుదును కలిగి ఉన్నాడు; ఈ రాజవంశాలలో మహామేఘవాహన, వసిష్ఠ, మాతారా, పిత్రాభక్తా, శైలోద్భవ, సోమవంశి, తూర్పు గంగా వంశాలు ఉన్నాయి. భౌమా-కరాలు మరొక ముఖ్యమైన ప్రాంతీయ రాజవంశం అయినప్పటికీ వారు తమ రాజ్యాన్ని కళింగ అని పిలవలేదు. వివిధ సమయాలలో కళింగ ప్రాంతం కూడా పెద్ద సామ్రాజ్యాలలో భాగంగా ఉండేది. తూర్పు గంగా తరువాత కళింగ క్రమంగా దాని ప్రత్యేక రాజకీయ గుర్తింపును కోల్పోయింది.