కాకతీయ శిలాతోరణ ద్వారం
From Wikipedia, the free encyclopedia
దక్షిణ భారత దేశంలోని కాకతీయ సామ్రాజ్యానికి ప్రతీకగా నిలుస్తుంది కాకతీయ శిలా తోరణ స్తంభం. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో [1][2] స్థానం పొందింది. కాకతీయులు తమ చిహ్నంగా నిర్మించుకున్న దీనిని వరంగల్ గేట్ గా పరిగణిస్తారు. ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లోని వరంగల్ (పట్టణ) జిల్లాలో ఉంది.[3]