తిరుమల తిరుపతి దేవస్థానం
From Wikipedia, the free encyclopedia
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి జిల్లాకు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయమైన తిరుమల వెంకటేశ్వరుని ఆలయాన్ని నిర్వహించే ఒక స్వతంత్ర సంస్థ. ఇది దేవాలయం బాగోగులు చూడడమే కాక వివిధ సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, విద్యా సంబందమైన కార్యక్రమాలను భారతదేశం నలువైపులా నిర్వహిస్తుంటుంది. 1933లో టీటీడీ పాలకమండలి ఏర్పాటైంది.[1] ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందు ఆలయ పాలకమండలి, ₹1925 కోట్ల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజికసేవ, కల్యాణమస్తు, దళితగోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ... వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులు ఉంటారు. వీరు దేవస్థానం నిర్వహించే 12 ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు.
స్థాపన | 1932; 92 సంవత్సరాల క్రితం (1932) |
---|---|
రకం | ట్రష్టు |
కేంద్రీకరణ | తిరుమల వెంకటేశ్వరునితో సహా 12 ఆలయాల నిర్వహణ |
ప్రధాన కార్యాలయాలు | తిరుపతి |
చైర్మెన్ | వై. వి. సుబ్బారెడ్డి |
కార్యనిర్వహణాధికారి | ఎ.వి. ధర్మారెడ్డి |
ఇది వాటికన్ తరువాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్టిండియా కంపెనీ వారికి సంవత్సరానికి ₹1 లక్ష వచ్చేది.[2] స్వామి వారి ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్ను తితిదే ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వాహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం తితిదే 19 రికార్డులను నిర్వహిస్తోంది.[3]