![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7c/East_Godavari_in_Andhra_Pradesh_%2528India%2529.svg/langte-640px-East_Godavari_in_Andhra_Pradesh_%2528India%2529.svg.png&w=640&q=50)
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
తూర్పు గోదావరి జిల్లా, భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా. రాజమహేంద్రవరం దీని ముఖ్యపట్టణం. 2022 లో జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా, దీనిలో కొన్ని ప్రాంతాలు కొత్తగా ఏర్పడిన కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో చేర్చగా, గతంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని కొన్ని ప్రాంతాలను ఈ జిల్లాలో కలిపారు. గోదావరి తీరంలో పలు ఆలయాలు, ధవళేశ్వరం ఆనకట్ట,ధవళేశ్వరం లోని కాటన్ ప్రదర్శనశాల,, కడియం లోని పూలతోటలు జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యాటక ప్రాంతాలైన పాపి కొండలు మొదలగు ప్రాంతాల విహారయాత్రలకు జిల్లా రాజధాని రాజమండ్రి ఒక ముఖ్య కేంద్రం.
త్వరిత వాస్తవాలు తూర్పు గోదావరి జిల్లా, దేశం ...
తూర్పు గోదావరి జిల్లా | |
---|---|
![]() రాజమండ్రి దగ్గర గోదావరి రైలు వంతెనలు (ఎడమ-వాడుక తొలగినది , కుడి - వాడుకలోనున్నది) | |
![]() | |
దేశం | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
ప్రాంతం | కోస్తా |
ప్రధాన కార్యాలయం | రాజమహేంద్రవరం |
విస్తీర్ణం | |
• Total | 2,561 km2 (989 sq mi) |
జనాభా (2011)[1] | |
• Total | 18,32,300 |
• జనసాంద్రత | 720/km2 (1,900/sq mi) |
భాషలు | |
• అధికార | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 0 ( ) |
Website | https://eastgodavari.nic.in/te/ |
మూసివేయి