దీప్ సిద్ధూ
From Wikipedia, the free encyclopedia
దీప్ సిద్ధూ (2 ఏప్రిల్ 1984 - 15 ఫిబ్రవరి 2022) మోడల్, పంజాబ్ నటుడు, న్యాయవాది. గతంలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఉద్యమంలో దీప్ సిద్ధూ చేరాడు. ఎర్రకోటలో 2021 గణతంత్ర దినోత్సవ హింసాకాండ కేసులో నిందితుడు.[1]
దీప్ సిద్ధూ | |
---|---|
జననం | (1984-04-02)1984 ఏప్రిల్ 2 ముక్త్సార్, పంజాబ్, భారతదేశం |
మరణం | 2022 ఫిబ్రవరి 15(2022-02-15) (వయసు 37) హర్యానా, భారతదేశం |
వృత్తి | నటుడు, కార్యకర్త, న్యాయవాది |
1984లో పంజాబ్లోని ముక్త్సార్ లో దీప్ సిద్ధూ జన్మించాడు.[2][3] లా చదివాడు. మోడలింగ్ వైపు దృష్టి సారించాడు. ఆ తరువాత తన సినీ కెరీర్ను పంజాబీ చిత్రం రామ్తా జోగితో ప్రారంభించాడు, దీనిని నటుడు ధర్మేంద్ర తన బ్యానర్ విజయతా ఫిల్మ్స్పై నిర్మించారు.[4][5]
2019 లోక్సభ ఎన్నికల సమయంలో దీప్ సిద్ధూ రాజకీయాల్లోకి ప్రవేశించాడు. గురుదాస్పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కోసం ప్రచారం చేసాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నాడు.
2022 ఫిబ్రవరి 15న దీప్ సిద్ధూ ఢిల్లీ నుంచి పంజాబ్లోని భటిండాకు వెళుతుండగా కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై రోడ్డు ప్రమాదంలో మరణించాడు.[6][7]