![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/85/Sri_Draupadi_Maju%252C_Nepal.jpg/640px-Sri_Draupadi_Maju%252C_Nepal.jpg&w=640&q=50)
ద్రౌపది
ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. / From Wikipedia, the free encyclopedia
ద్రౌపది దృపద మహారాజు యాగపుత్రిక. పాండవుల సతి. ద్రౌపది ఒక జన్మలో మౌద్గల్యుడు అనే ముని భార్య - ఇంద్రసేన. మౌద్గల్యుడు ఐదు శరీరాలు ధరించి ఆమెతో విహరించాడు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/85/Sri_Draupadi_Maju%2C_Nepal.jpg/320px-Sri_Draupadi_Maju%2C_Nepal.jpg)
రెండవ జన్మలో ఆమె కాశీరాజు పుత్రికగా జన్మించింది. చాలాకాలం కన్యగా ఉండి శివుని గురించి తీవ్ర తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా పతి అని ఐదుసార్లు కోరింది. తరువాత శివుడు ఇంద్రున్ని ఐదు మూర్తులుగా రూపొందించి మానవులుగా పుట్టవలసిందని శాసించాడు. ఆ పంచేంద్రియాలే ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వినులు. వారి ద్వారా పంచపాండవులు జన్మించారు.
మూడవ జన్మలో ద్రుపదుని పుత్రికగా ద్రౌపది జన్మించింది. ద్రోణాచార్యుని ఆఙ్ఞ ప్రకారం అర్జునుడు వెళ్ళి దృపదుని భందించి ద్రోణుని ముందుంచుతాడు. ద్రోణుని వలన కలిగిన గర్వభంగానికి బాధపడిన దృపదుడు, ద్రోణుని చంపగల కుమారుడు, పరాక్రమవంతుడైన అర్జునుని పెండ్లాడగలిగే కుమార్తెను పొందాలనే సంకల్పంతో యఙ్ఞం చేస్తాడు. ఆ యాగ ఫలంగా ద్రౌపది, ధృష్టద్యుమ్నుడు జన్మించుట జరుగుతుంది.