నిఘంటువు
పదకోశము / From Wikipedia, the free encyclopedia
నిఘంటువు (అనగా ఆక్షర క్రమములో పదములు, వాటి అర్థములు కలిగినది. దీనినే పదకోశము, వ్యుత్పత్తి కోశము అనికూడా అంటారు. తెలుగు భాష యందు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ రచించిన నిఘంటువు ప్రఖ్యాతి గాంచింది. గిడుగు రామమూర్తి గారు తెలుగు సవర పదకోశం చేశారు. నిఘంటువులలో యాస్కుడు కశ్యపుడు మున్నగు ముని పుంగవులు రచించిన నిరుక్తములు అను నామము కలవి వేదమునకు చెందినవి. ఏయే మహర్షి ఏయే వేదములోని పదములనే రీతిన రచించెనో ఆ నిరుక్తము ఆ వేదము యొక్కది అగును. ఇందువలన ఒక్కొక్క నిరుక్తము ఒక్కొక్క వేదసంబంధమైనదిగ ఉండును. కొంతకాలము నుంచి కొందరు పండితులు ఈ నిరుక్తములవలనే ఒక్కొక్క గ్రంథమునకు, ఒక్కొక్క కవి రచించిన అన్ని గ్రంథములకు ఆ గ్రంథముల పేరుతో నిఘంటువులను, ఆ కవి పేరుతో నిఘంటువులను రచించుట జరిగింది. ఈ నిఘంటువులు పలు రకాలు. పర్వాయపదములను బోధించునవి కొన్ని, ఉదాహరణకు అమరకోశము, నామలింగానుశాసనము, అభిదాన చింతామణి మొదలగునవి. శబ్దములయొక్క నానార్థములను తెలుపునవి మరికొన్ని.వీటినే నానార్థ నిఘంటువులు అంటారు. ఉదాహరణకు దండినాథుని నానార్థరత్నమాల, మేదినీ కోశము, విశ్వప్రకాశము మొదలైనవి. సంస్కృత భాషలో శబ్దబోధక నిఘంటువులు శబ్ద వ్యుత్పత్తిని వివరించునవి మరికొన్ని. తెలుగులో నానర్థ నిఘంటువును సూరయామాత్యుడు రచించిన నానార్థరత్నమాల మాత్రమే అని చెప్పవచ్చును.అలానే సంస్కృతములో ఏకాక్షర నిఘంటువులు కొన్ని ఉన్నాయి. అవి తెలుగులో మనకు లేవు. అలానే సంస్కృతములో లేని నిఘంటువు ఒకటి తెలుగులో లభించును. అదియే రామయణము కృష్ణయామాత్యుడు రచించిన దేశ్యనామార్థకోశ, తెలుగులూ వివిధ దేశ్యములైన పేళ్ళతో కల నిఘంటువు.
అష్టాదశ మహాపురాణములలో చేరిన శ్రీమద్వేద మహర్షి ప్రణీతమైన అగ్నిపురాణములోను నిఘంటు నిర్మాణ ప్రక్రియయే అనంత నిఘంటు నిర్మాతలకు మార్గదర్శకము.