పీర్ పంజాల్ శ్రేణి
భారత దేశం లోని పర్వత శ్రేణి / From Wikipedia, the free encyclopedia
పీర్ పంజాల్ శ్రేణి అంతర హిమాలయాల్లోని పర్వత సమూహం. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీరు, పాక్ ఆక్రమిత కాశ్మీరుల్లో తూర్పు-ఆగ్నేయం నుండి పశ్చిమ-వాయువ్యంగా ఇది విస్తరించి ఉంది. దీన్ని హిందూ మత గ్రంథాల్లో పాంచాలదేవ అని పేర్కొన్నారు. ఇక్కడ సగటు ఎత్తు 1400 మీ. - 4,100 మీ. మధ్య ఉంటుంది. ధౌలాధార్, పీర్ పంజాల్ శ్రేణుల వైపు పోతూ ఉంటే హిమాలాయల ఎత్తు పెరుగుతూ పోతుంది. మధ్య హిమాలయాల్లో పీర్ పంజాల్ అత్యంత పెద్ద శ్రేణి. సట్లెజ్ నది ఒడ్డున, ఇది హిమాలయాల నుండి విడిపోయి, బియాస్, రావి నదులను వేరు చేస్తూ పోతుంది.