మధ్యాక్కఱ
From Wikipedia, the free encyclopedia
మధ్యాక్కఱ ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. మధ్యాక్కఱ అత్యంత ప్రాచీన పద్యరూపం. నన్నయ కాలానికి ముందే వున్న ప్రాఙ్నన్నయ యుగములోనే ఈ పద్యరీతి శాసనాల్లో వాడుకలో ఉండడం కనిపిస్తోంది.[1] ఆపైన నన్నయ యుగంలో కూడా దీని వాడుక కనిపిస్తోంది. ఆంధ్రమహా భారత రచనలో ఆదికవి, వాగనుశాసనుడు అయిన నన్నయ్య ఈ ఛందోరీతిని వినియోగించారు. ఆపైన కావ్యాల వాడుకలోంచి క్రమంగా తప్పిపోయి విస్మృతిలో పడిపోయింది. తిరిగి వేయేళ్ళనాటి ఈ ఛందోరూపాన్ని కవిసమ్రాట్, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తిరిగి వాడుకలోకి తీసుకువచ్చారు. తన రామాయణ కల్పవృక్షంలో వాడడమే కాక విశ్వనాథ మధ్యాక్కఱలు వంటి శతకాలు అన్నీ అవే ఛందోరూపాలతో రచించారు.
మరింత సమాచారం పద్య విశేషాలు ...
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
మూసివేయి