ముస్లింలలో అపవిశ్వాసాలు
From Wikipedia, the free encyclopedia
ముస్లింలలో అపవిశ్వాసాలు : ముస్లింలలో అపవిశ్వాసాలు లేదా విశ్వాసపరంగా "ఫిర్ఖా" (చీలికలు లేదా భాగాలు) లు ఏర్పడ్డాయి. ఇచ్చట గమనించవలసిన విషయాలు రెండు, అవి 1. మూలవిశ్వాసం. (అత్యంత ప్రధానమైనది), 2. ఉ (అ)పవిశ్వాసాలు (అంతగా ప్రాధాన్యతలు లేనివి), మూలవిశ్వాసం అన్ని ఫిర్ఖాలది ఒకటే అయినా, ప్రాధాన్యత లేని, ప్రాధాన్యత ఇవ్వకూడని అపవిశ్వాసాల విషయాల పట్ల తమ శక్తియుక్తులంతా ప్రదర్శించి విర్రవీగే సాధారణ ప్రజగూర్చి ప్రవక్త ఇలా అన్నారు: "ఇశ్రాయేలు ప్రజలు 72 తెగలుగా చీలిపోయారు. నా ప్రజలు 73 తెగలుగా చీలిపోతారు. అందులో ఒకటి (అత్యంత ప్రధానమైన మూలవిశ్వాసం) తప్ప మిగతా తెగలవారంతా (అంతగా ప్రాధాన్యంలేని విశ్వాసాలుంచి, చీలికలు తెచ్చినవారు) నరకానికి పోతారు . ఆ ఒక్క తెగ యొక్క మతం (మూల విశ్వాసం) ఏదంటే నేనూ, నా అనుచరులు చెప్పిందే " మిష్కాత్ ఎ షరీఫ్ గ్రంథం మొదటి విభాగం 4 వ అధ్యాయం 2 వ వచనంలో ఉంది.
73 తెగలు తయారవుతాయని ప్రవక్తగారే చెప్పారు గనుక అలా జరుగవలసిందే. షేక్ అబ్దుల్ ఖాదిర్ గారు ఇస్లాంలో 150 పైగా తెగలున్నట్లు తన ప్రఖ్యాత గ్రంథం గియాసుల్ లుగత్లో తెలియజేశారు. అయితే షార్హుల్ మువాకిఫ్ గారు ఇస్లాంలో ప్రఖ్యాతిగాంచినవి 8 తెగలు మాత్రమేనని చెబుతున్నారు.ముస్లింలలో కులాలు గూడా చూడండి.