శనివారపుపేట
ఆంధ్రప్రదేశ్, ఏలూరు జిల్లా, ఏలూరు మండల జనగణన పట్టణం / From Wikipedia, the free encyclopedia
శనివారపుపేట, ఏలూరు జిల్లా, ఏలూరు మండలానికి చెందిన జనగణన పట్టణం. ఇది ఏలూరు రెవెన్యూ డివిజన్ లోని ఏలూరు మండలంలో ఉంది. ఈ పట్టణం ఏలూరు పట్టణ సమ్మేళనంలో ఒక భాగం. ఏలూరు నుండి ముసునూరు మీదుగా నూజివీడు వెళ్ళేమార్గంలో ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం దాదాపు ఏలూరు నగరంలో కలిసిపోయింది. గ్రామం శివారులలోని పొలాలలో వరి, కొబ్బరి, కూరగాయలు ప్రధానమైన పంటలు. గ్రామంలో చెన్నకేశవ స్వామి, రామ లింగేశ్వర స్వామి వార్ల దేవాలయం ప్రధానమైన ఆకర్షణ. ఈ ఆలయం చిన్న తిరుపతి దేవస్థానం వారి నిర్వహణలో ఉంది. ఈ ఆలయ గోపురం చాలా ఎత్తైంది, వివిధ పురాణ గాథలు చక్కని శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు అక్షాంశరేఖాంశాలు: 16.723789°N 81.096208°E /, రాష్ట్రం ...
శనివారపుపేట | |
— జనగణన పట్టణం — | |
శ్రీ చెన్నకేశవస్వామి దేవాలయం, శనివారంపేట | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16.723789°N 81.096208°E / 16.723789; 81.096208 | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పశ్చిమ గోదావరి |
మండలం | ఏలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 8,142 |
- పురుషులు | 4,112 |
- స్త్రీలు | 4,030 |
- గృహాల సంఖ్య | 2,114 |
పిన్ కోడ్ | 534002 |
ఎస్.టి.డి కోడ్ |
మూసివేయి