శ్రీలంకలో హిందూమతం
శ్రీలంక దేశంలో హిందూమత విస్తృతి, ప్రభావాలు / From Wikipedia, the free encyclopedia
హిందూమతం శ్రీలంక లోని అత్యంత పురాతన మతాలలో ఒకటి. ఇక్కడ 2,000 సంవత్సరాల నాడే దేవాలయాలు ఉన్నాయి. [1] 2011 నాటికి, శ్రీలంక జనాభాలో హిందువులు 12.6% ఉన్నారు. [2] భారతదేశం, పాకిస్తాన్ నుండి (సింధీలు, తెలుగులు, మలయాళీలతో సహా) వచ్చిన చిన్నచిన్న వలస సమాజాలను మినహాయిస్తే, వారంతా దాదాపుగా తమిళులే. మెజారిటీ సింహళీయులు ఆచరించే బౌద్ధమతంపై హిందూమతం పెద్ద ప్రభావాన్ని చూపింది.
మొత్తం జనాభా | |
---|---|
25,61,299 (2012) మొత్తం జనాభాలో 12.6% | |
మతాలు | |
హిందూమతం శైవం (మెజారిటీ) వైష్ణవం, శాక్తేయం (అల్పసంఖ్యాక) | |
గ్రంథాలు | |
రామాయణం , వేదాలు | |
భాషలు | |
ప్రాచీన తమిళం, సంస్కృతం తమిళం, సింహళం |
1915 జనాభా లెక్కల ప్రకారం, శ్రీలంక జనాభాలో హిందువులు దాదాపు 25% ఉన్నారు (బ్రిటిషు వారు తీసుకువచ్చిన ఒప్పంద కార్మికులతో సహా). [3] ఉత్తర, తూర్పు ప్రావిన్స్లలో (ఇక్కడ తమిళులు అతిపెద్ద జనాభా), మధ్య ప్రాంతాల్లో, రాజధాని కొలంబోలో హిందూమతం ఎక్కువగా ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం, శ్రీలంకలో 25,54,606 మంది హిందువులు ఉన్నారు (దేశ జనాభాలో 12.6%). శ్రీలంక అంతర్యుద్ధం సమయంలో, చాలా మంది తమిళులు వలస పోయారు. శ్రీలంక తమిళ ప్రవాసులు నిర్మించిన హిందూ దేవాలయాలు మతాన్ని, సంప్రదాయాన్నీ, సంస్కృతినీ కాపాడుతున్నాయి. [4] [5]
ఎక్కువ మంది శ్రీలంక హిందువులు శైవాన్ని అనుసరిస్తారు. కొందరు శక్తి ఆరాధన చేస్తారు . శ్రీలంకలో శివుని ఐదు ప్రధాన నివాసాలకు నిలయం: పంచ ఈశ్వరములు అంటారు. రావణుడు నిర్మించిన పవిత్ర స్థలాలివి. తమిళులు పూజించే మురుగన్ దేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవతలలో ఒకరు. [6] [7]
జాఫ్నాకు చెందిన యోగస్వామి శ్రీలంక చరిత్రలో ముఖ్యమైన ఆధునిక హిందూ మత వ్యక్తి. 20వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్త. అతను దేశంలోని తమిళ హిందూ జనాభాకు సద్గురువు. అంపరై, బట్టికలోవా జిల్లాలలో రామకృష్ణ మఠం చురుకుగా ఉంది. శైవ సిద్ధాంత పాఠశాల ఉత్తరాన ప్రబలంగా ఉంది. [8] యోగస్వామి నందినాథ సంప్రదాయంలో 161 వ అధిపతి. శివయ్య సుబ్రమణ్యస్వామి ఆయన వారసుడు. [9]