అధినివేశ ప్రతిపత్తి
From Wikipedia, the free encyclopedia
అధినివేశ ప్రతిపత్తిని ఇంగ్లీషులో Dominion Status అంటారు. ఇది 19 శతాబ్దములో బ్రిటిష్ ప్రభుత్వము తమ నిరంకుశ పరిపాలనలోనుండిన వలసరాజ్యములు స్వరాజ్యముకావలెననికోరి ఆందోళన చేయుచున్న దేశములకు తమ సామ్రాజ్యములో భాగముగనే వుంచుతూ అనుగ్రహించే ఒక విధమైన ప్రజాపరిపాలనా పధ్దతి. అట్టి ప్రజాపరిపాలనా పద్ధతి ఫెడరల్ సంయుక్తరాజ్యాంగమందురు. స్వరాజ్యమే గాని, పూర్ణ స్వరాజ్యము కాదు. అట్టి అదినివేశ స్వరాజ్యమనే రాజ్యాంగము కలుగచేసిన యడల స్వపరిపాలన చేసుకునప్పటికినీ స్వరాజ్య జాతీయప్రభుత్వముతో పరిపాలింపబడు భారతదేశము బ్రిటిష్ సామ్రాజ్యములోని స్వతంత్రరాజ్య సమ్మేళనములో నొకటైయుండెడిది. డొమీనియన్ అనగా రాష్ట్రము అని అర్దము చెప్పినప్పటికీ రాజ్యాంగ స్థితి, ప్రభుత్వాధికారమునొసగిన రాజ్యాంగ సంస్థను బట్టి డొమీనియన్ అను మాట కాలక్రమేణా కొంచెం మార్పుచెందినది. 1926 అక్టోబరు 26 తేదీన బ్రిటిష్ ప్రభుత్వము తమ రాజ్యప్రతినిధి ద్వారా చేసిన ప్రకటనలో అధినివేశ ప్రతిపత్తి వలననే భారతదేశముయెక్క రాజ్యాంగమబివృధ్ధి కాగలదని వక్కాణించియున్నారు. 1926 లో సమావేశమైనబ్రిటిష్ సామ్రాజ్యసభ (Imperial Conference) వారి తీర్మానమునందు అదినివేశస్వరాజ్యములయొక్క లక్షణములు వివిరింపబడియున్నవి. 1920 లో తిలక్ మరణించిన తరువాత కొంతకాలము దేశములో నెలకొనియున్న అనిశ్ఛలతమైనస్వరాజ్యభావముల కాలమందు 1927 లో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశములో చేసిన తీర్మానము ప్రకారము భారతరాజ్యాంగ ముసాయిదా (చిత్తు) తయారుచేయబడినదనీనూ అందులో ప్రస్తావించిన స్వరాజ్యము అప్పటిలో బ్రిటిష్ సామ్రాజ్యములోనున్న డొమీనియన్లు అనబడు దేశములు (DOMINIONS) కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశములందు గల స్వరాజ్య ప్రజాప్రభుత్వములాంటి సరిసమానస్తాయిని డొమీనియన్ స్టెటస్ (dominion status) కావలెనని కోరబడినదని చరిత్రలో విశదమగుచున్నది.[1] 1926-1931లో భారతదేశమును పరిపాలించిన వైస్రాయి, లార్డు ఇర్విన్ ప్రభువు అప్పటిలో ఉదృతముగా ప్రబలుతున్న స్వరాజ్య కాంక్షకు సానుభూతిగనూ, కొంత ఉపశమనము కలుగచేయుటకునూ అవలంబించిన రాజనీతితో భారతదేశానికి డొమీనియన్ స్టేటస్ ఇవ్వబడవచ్చునను ఆశాచూపెట్టెను. ఆ కాలమందు తెలుగు ప్రాంతములలో మేధావులు రాజనీతిజ్ఞలును ఆ ఇంగ్లీషు పదమైన డొమీనియన్ స్టేటస్ కు తెలుగుసేతగా అధినివేశ స్వరాజ్యమని చెప్పిరి.[2]