గిడుగు వెంకట రామమూర్తి
తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు / From Wikipedia, the free encyclopedia
గిడుగు వెంకట రామమూర్తి (1863 ఆగష్టు 1863 - 1940 జనవరి 22 ) తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు . గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము. [1][2][3][4][5]
త్వరిత వాస్తవాలు గిడుగు వెంకట రామమూర్తి, జననం ...
గిడుగు వెంకట రామమూర్తి | |
---|---|
జననం | గిడుగు వెంకట రామమూర్తి. (1863-08-29)1863 ఆగస్టు 29 శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామం |
మరణం | 1940 జనవరి 22(1940-01-22) (వయసు 76) |
నివాస ప్రాంతం | పర్వతాలపేట |
ఇతర పేర్లు | రావ్ సాహెబ్, కళాప్రపూర్ణ |
వృత్తి | రచయిత |
ప్రసిద్ధి | ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది |
పిల్లలు | గిడుగు సీతాపతి |
బంధువులు | గిడుగు రాజేశ్వరరావు (మనుమడు) స్నేహలత మురళి (ముని మనవరాలు) |
తండ్రి | వీర్రాజు |
తల్లి | వెంకమ్మ |
Notes గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం” గా జరుపుకుంటున్నాం |
మూసివేయి