గౌతమ బుద్ధుడు
భారతీయ తత్వవేత్త, సంస్కర్త బౌద్ధమత స్థాపకుడు / From Wikipedia, the free encyclopedia
గౌతము బుద్ధుడు (సిద్దార్ధ గౌతముడు, బుద్ధుడు) (సంస్కృతం:सिद्धार्थ गौतमः (సిద్ధార్ధగౌతమః) ; పాళీ: సిద్దాత్త గోతమ) బౌద్ధ ధర్మానికి మూల కారకులు. నాటి ఆధ్యాత్మిక గురువులలో ఒకరు. బౌద్ధులందరిచే మహా బుద్ధుడిగా కీర్తింపబడేవాడు. బుద్ధుని జనన మరణాల కాలం స్పష్టంగా తెలియరావడం లేదు. 20వ శతాబ్దపు చారిత్రకకారులు క్రీ.పూ. 563 నుండి 483 మధ్యలో జననం అని, క్రీ.పూ 410 నుండి 400 మధ్యలో మరణం ఉండవచ్చు అని భావిస్తున్నారు.[2] మిగతా లెక్కలను ఇంకా అత్యధికుల ఆమోదించలేదు.
గౌతమ బుద్ధుడు | |
---|---|
జననం | సిద్ధార్ధుడు c. సా.శ.పూ.563 BCE [1] కపిలవస్తు,లుంబినీవనం |
మరణం | c. సా.శ.పూ. 483 BCE (వయస్సు 80) లేక సా.శ.పూ. 411 కాని సా.శ.పూ.400 కుశినగరం |
నివాస ప్రాంతం | కపిలవస్తు |
ఇతర పేర్లు | శాక్యముని |
ప్రసిద్ధి | బౌద్ధ మత స్థాపకుడు |
ముందు వారు | కశ్యప బుద్ధ |
తర్వాత వారు | మైత్రేయ బుద్ధ |
మతం | బౌద్ధమతం |
పిల్లలు | రాహులుడు |
తండ్రి | శుద్ధోధనుడు |
తల్లి | మహామాయ మహా ప్రజాపతి(పెంపకం) |
గౌతముడిని శాక్యముని అని కూడా పిలుస్తారు. శాఖ్య వంశస్థులు వ్యవసాయముతోపాటు పరిపాలన చేసేవారు. ఆయన జీవిత సంఘటనలు, బోధలు, భిక్షువుల నడవడికలు మొదలగునవి అన్ని ఆయన మరణం తరువాత సంఘముచే తరతరాలుగా పారాయణం చేయబడ్డాయి. మొదట నోటి మాటగా బోధింపబడినా, దాదాపు నాలుగు వందల సంవత్సరాల తరువాత త్రిపీటక అనే పేరుతో మూడు పీఠికలుగా విభజింపబడి భద్రపరిచారు.
బుద్ధుడు కానీ బౌద్ధం కానీ