భువనగిరి
From Wikipedia, the free encyclopedia
భువనగిరి, తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా, భువనగిరి మండలానికి చెందిన గ్రామం.[1] భువనగిరి ఒక ముఖ్య పటణం. భువనగిరిలో ఉన్న కోట కాకతీయుల కాలంలో మిక్కిలి ప్రసిద్ధి చెందింది. ఈ కోట పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన పాలకుడైన త్రిభువన మల్ల విక్రమాదిత్య (ఆరవ) చే ఏకశిలారాతి గుట్టపై నిర్మించబడింది. అతని పేరు మీదుగా దీనికి త్రిభువనగిరి అని పేరు వచ్చింది. ఈ పేరు క్రమంగా భువనగిరి అయ్యింది.[2]