మండలం
భారతదేశంలో జిల్లాల ఉప పరిపాలనా విభాగాలు / From Wikipedia, the free encyclopedia
మండలం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలలో ఒక రెవెన్యూ పరిపాలనా, అభివృద్ధి ప్రణాళికా విభాగం.అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో పూర్వం తాలూకా, పంచాయితీ సమితి (బ్లాక్) విభజన ఉండేది.[1] పరిపాలనా సౌలభ్యం కొరకు ఇదివరకటి తాలూకాలను రద్దు చేసి, 1985లో తెలుగు దేశం ప్రభుత్వ పరిపాలనలో, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవస్థకు బదులుగా మండలవిభజన వ్యవస్థను 1985 మే 25న ప్రవేశపెట్టడం జరిగింది.[2] మండలాలు ఇవి బ్లాకు లేదా సమితి కన్నా ఏరియాలో, జనాభాలో కొంచెం చిన్నవిగా ఉండేటట్లు, కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి మండలాలుగా విభజించబడ్డాయి.అలాగే జిల్లాని కూడా కొన్నిపట్టణ ప్రాంతపు మండలాలుగా విభజించబడ్డాయి.[3][3][4]