ఆంధ్రప్రదేశ్
భారతదేశ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోని ఆగ్నేయ తీర ప్రాంతంలోని ఒక రాష్ట్రం.[6] ఈ రాష్ట్రం 12°37', 19°54' ఉత్తర అక్షాంశాల మధ్య, 76°46', 84°46' తూర్పు రేఖాంశాల మధ్య వ్యాపించి ఉంది. భారత ప్రామాణిక రేఖాంశమైన 82°30' తూర్పు రేఖాంశం రాష్ట్రంలోని కాకినాడ మీదుగా పోతుంది. రాష్ట్రానికి వాయవ్యంగా తెలంగాణ, ఉత్తరాన ఛత్తీస్గఢ్, ఈశాన్యంలో ఒడిషా, దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన కర్ణాటక, తూర్పున బంగాళాఖాతం ఉన్నాయి. కేంద్రపాలితప్రాంత భూభాగం పుదుచ్చేరికి చెందిన యానాం రాష్ట్రం హద్దులలో ఉంది.
ఆంధ్రప్రదేశ్ | |||||||
---|---|---|---|---|---|---|---|
| |||||||
Motto(s): | |||||||
Anthem: "మా తెలుగు తల్లికి మల్లె పూదండ" | |||||||
Coordinates (ఆంధ్రప్రదేశ్): 16.53°N 80.47°E / 16.53; 80.47 | |||||||
దేశం | భారతదేశం | ||||||
రాష్ట్రావతరణ | 1956 నవంబరు 1 | ||||||
రాజధాని | అమరావతి | ||||||
Government | |||||||
• Body | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం | ||||||
• గవర్నరు | సయద్ అబ్దుల్ నశీద్ | ||||||
• ముఖ్యమంత్రి | వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ||||||
Area | |||||||
• Total | 1,62,970 km2 (62,920 sq mi) | ||||||
• Rank | 7వ | ||||||
Population (2011)[2] | |||||||
• Total | 4,93,86,799 | ||||||
• Rank | 10వ | ||||||
• Density | 308/km2 (800/sq mi) | ||||||
జి.డి.పి (2021-22 ముందస్తు అంచన) | |||||||
• మొత్తం | ₹12.02 లక్ష కోట్లు (US$150 billion) | ||||||
• తలసరి | ₹2,00,771 (US$2,500) | ||||||
Time zone | UTC+5:30 (IST) | ||||||
UN/LOCODE | AP 39 | ||||||
అక్షరాస్యత రేటు | 67.41% (2011) | ||||||
అధికార భాషలు | తెలుగు | ||||||
తీరప్రాంతం | 974 kilometres (605 mi) | ||||||
Symbols of ఆంధ్రప్రదేశ్ | |||||||
Emblem | ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నం | ||||||
Song | మా తెలుగు తల్లికి[4] | ||||||
Language | తెలుగు | ||||||
Bird | రామచిలుక[5] | ||||||
Fish | డాల్ఫిన్ | ||||||
Flower | మల్లె[5] | ||||||
Tree | వేప[5] | ||||||
Dance | కూచిపూడి | ||||||
Sport | చెడుగుడు | ||||||
162,970 km2 (62,920 sq mi) విస్తీర్ణంతో ఇది ఎనిమిదవ అతిపెద్ద రాష్ట్రం.[7] భారతదేశంలో గుజరాత్ తరువాత 974 km (605 mi)తో రెండవ పొడవైన తీరప్రాంతం కలిగివుంది.[8] కోహినూర్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలు రాష్ట్రంలోని కోళ్లూరు గనిలో లభించాయి.[9][10] భారతదేశ ప్రాచీన భాషలలో ఒకటైన తెలుగు దీని అధికార భాష.
తిరుమల వెంకటేశ్వర ఆలయం ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే పుణ్యక్షేత్రాలలో ఒకటి.[11] పంచారామ క్షేత్రాలు, శ్రీశైల క్షేత్రం, కోదండ రామాలయం వంటి అనేక పుణ్యక్షేత్రాలు, అమరావతి స్తూపంతో పాటు ఇంకా పలు ప్రదేశాలలో బౌద్ధ చైత్యాలు, స్తూపాలు, విశాఖపట్నం సముద్ర తీరం, అరకు లోయ, హార్స్లీ కొండలు, కోనసీమ డెల్టా లాంటి సహజ ఆకర్షణలు ఉన్నాయి.