రంగనాథ రామాయణము
కవి రంగనాథ (గోన బుద్దారెడ్డి) చేత తెలుగులో వాల్మీకి రామాయణం యొక్క అనుసరణలు / From Wikipedia, the free encyclopedia
వర్థమానపురాన్ని ఏలిన గోన బుద్దారెడ్డి తండ్రి కోరిక మేరకు స.శ.1294-1300 కాలంలో ఈ రామాయణాన్ని రచించాడు.[1] పాల్కుర్కి సోమనాథుడు తర్వాత ద్విపద కవితను రచించిన వారిలో గోనబుద్దారెడ్డి రెండవవాడు. యుద్ధకాండ వరకు ఇతను రచించగా మిగిలిన భాగాన్ని ఇతని కుమారులు పూర్తిచేశారు.ఇతని కుమారుడు గోన గణపతిరెడ్డి తండ్రిపేరిట బుద్ధేశ్వరాలయాన్ని నిర్మించాడు. ఉత్తరకాండ కర్తలయిన కాచ, విఠలనాథులు ఇతని కుమారులేనని కొందరు పరిశోధకులు వ్రాశారు.[2] ఐ సాహిత్య విమర్శకుడు వేటూరి ప్రభాకరశాస్త్రి గోన బుద్ధారెడ్డి పినతండ్రి కుమారుడైన మరో గన్నారెడ్డి కుమారులే ఉత్తర రంగనాథరామాయణ కర్తలను పరిశోధన వెలువరించారు.[3]
త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...
రంగనాథ రామాయణము | |
కృతికర్త: | గోన బుద్దారెడ్డి |
---|---|
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | రామాయణం |
ప్రచురణ: | రాయలు అండు కో, కడప |
విడుదల: | 1949 |
మూసివేయి