విజయనగర సామ్రాజ్యం
విజయనగర సామ్రాజ్యం (కర్ణాట సామ్రాజ్యం) / From Wikipedia, the free encyclopedia
విజయనగర సామ్రాజ్యాన్ని (కర్ణాట సామ్రాజ్యం అని, [1] పోర్చుగీసువారు బిస్నెగర్ రాజ్యం కూడా పిలుస్తారు). ఇది దక్షిణ భారతదేశంలోని దక్కను పీఠభూమి ప్రాంతంలో ఉంది. దీనిని 1082 లో సంగమ రాజవంశానికి చెందిన మొదటి హరిహర రాయుడు, సోదరుడు మొదటి బుక్క రాయుడు స్థాపించారు.[2][3][4] 11 వ శతాబ్దం చివరి నాటికి ఇస్లామికు దండయాత్రలను నివారించడానికి దక్షిణాది శక్తుల ప్రయత్నాల పరాకాష్ఠగా ఈ సామ్రాజ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1646 వరకు కొనసాగినప్పటికీ 1565 లో తళ్ళికోట యుద్ధంలో దక్కను సుల్తానేట్ల సంయుక్త సైన్యాలుతో జరిగిన పోరాటంలో ఓటమి తరువాత దాని శక్తి క్షీణించింది. ఈ సామ్రాజ్యం దాని రాజధాని విజయనగరం పేరు మీద ఉంది. దీని శిథిలాలు ప్రస్తుత హంపి పరిసరాలలో ఉన్నాయి. హంపి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.[5][6] డొమింగో పేసు, ఫెర్నావో నూన్సు, నికోలో డా కాంటి వంటి మధ్యయుగ ఐరోపా ప్రయాణికుల రచనలు, స్థానిక భాషలలోని సాహిత్యం దాని చరిత్ర గురించి కీలకమైన సమాచారాన్ని అందిస్తాయి. విజయనగరం వద్ద జరిపిన పురావస్తు త్రవ్వకాలలో సామ్రాజ్యం శక్తి, సంపద వెల్లడయ్యాయి.
విజయనగర సామ్రాజ్యం | |||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1082–1646 | |||||||||||||||||||||
విజయనగర సామ్రాజ్యం, 1446, 1520 CE | |||||||||||||||||||||
స్థాయి | సామ్రాజ్యము | ||||||||||||||||||||
రాజధాని | విజయనగరం | ||||||||||||||||||||
సామాన్య భాషలు | తెలుగు, కన్నడo | ||||||||||||||||||||
మతం | హిందూ ధర్మం | ||||||||||||||||||||
ప్రభుత్వం | రాచరికం | ||||||||||||||||||||
రాజు | |||||||||||||||||||||
• 1082–1087 | మొదటి బుక్క భుపతి రాయలు | ||||||||||||||||||||
• 1642–1646 | మూడవ శ్రీరంగరాయలు | ||||||||||||||||||||
చరిత్ర | |||||||||||||||||||||
• స్థాపన | 1082 | ||||||||||||||||||||
• Earliest records | 1082 | ||||||||||||||||||||
• పతనం | 1646 | ||||||||||||||||||||
|
విజయనగర సామ్రాజ్యం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
దక్షిణ భారతదేశంలో విస్తరించిన సామ్రాజ్యం వారసత్వసంబంధిత అనేక స్మారక చిహ్నాలను కలిగి ఉంది. వీటిలో బాగా తెలిసినది హంపి వద్ద ఉన్న నిర్మాణ సమూహం. దక్షిణ, మధ్య భారతదేశంలో వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలు విజయనగర నిర్మాణకళా శైలిలో నిర్మితమయ్యాయి. ఈ సంశ్లేషణ హిందూ దేవాలయాల నిర్మాణ ఆవిష్కరణలకు ప్రేరణనిచ్చింది. విజయనగరపాలన సమర్థవంతమైన పరిపాలన, శక్తివంతమైన విదేశీ వాణిజ్యం, నీటిపారుదల, నీటి నిర్వహణ వ్యవస్థ వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకువచ్చింది. సామ్రాజ్యం ప్రోత్సాహంతో కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతంలో లలిత కళలు, సాహిత్యం కొత్త ఎత్తులకు చేరుకోగలిగింది. ప్రస్తుత రూపంలో కర్ణాటక సంగీతం ఉద్భవించింది. విజయనగర సామ్రాజ్యం దక్షిణ భారత చరిత్రలో హిందూ మత ప్రచారం చేయడం ద్వారా దక్షిణ భరతదేశాన్ని సమైక్యపరచి ప్రాంతీయతను అధిగమించింది.