ఎరిత్రియా
From Wikipedia, the free encyclopedia
Jones, Sam. "Eritrea human rights abuses may be crimes against humanity, says UN". The Guardian. Retrieved 8 June 2015. The report 'catalogues a litany of human rights violations by the "totalitarian" regime of President Isaias Afwerki "on a scope and scale seldom witnessed elsewhere"' said
ఎరిట్రియా లేదా ఎరిత్రియా (ఆంగ్లం : Eritrea), (అరబ్బీ : إرتريا ఇరిత్రియా), [1] అధికారిక నామం ఎరిట్రియా రాజ్యం [2] ఈశాన్య ఆఫ్రికా (హార్ను ఆఫ్ ఆఫ్రికా) లోని ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దీని తూర్పున, ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రపు పొడుగైన తీరం ఉంది. దేశవైశాల్యం 1,18,000 చ.కి.మీ. జనసంఖ్య 50 లక్షలు గలదు. దీని రాజధాని అస్మారా. దేశంలో దాహ్లాకు ద్వీపసమూహం, అనేక హనిషు దీవులు భాగంగా ఉన్నాయి. గ్రీకుపేరు ఎరిట్రియా ఎర్ర సముద్రం (Ἐρυθρὰ Θάλασσα ఎరిథ్రా తలాస్సా) ఆధారంగా దేశానికి నిర్ణయించబడిందని భావిస్తున్నారు. 1890 లో మొదటిసారిగా ఇటలీ ఎరిత్రియా నుండి ఇటలీని స్వీకరించి ఇటలీ దేశానికి నిర్ణయించబడింది.
ఎరిట్రియా ఒక బహుళ జాతి దేశంగా ఉంది. దేశజనాభాలో గుర్తింపు పొందిన 9 జాతి సమూహాలకు చెందిన సుమారు 5 మిలియన్ల ప్రజలు ఉన్నారు. చాలామంది నివాసితులకు ఇథియోపియా సెమిటికు భాషలు, కుషిటికు శాఖలు, ఆఫ్రోయాసియాటికు భాషా కుటుంబానికి చెందిన భాషలు వాడుకభాషలుగా ఉన్నాయి. ఈ సమూహాలలో 55% మందికి టిగ్రిన్యాసు వాడుకభాషగా ఉంది. సుమారు 30% మంది నివాసులకు టిగ్రే భాష వాడుకభాషగా ఉంది. అదనంగా అనేక నిలో-సహారను వాడుకభాషా వాడుకరులు ఉన్నారు. ఈ భూభాగంలో చాలామంది క్రైస్తవ మతం లేదా ఇస్లాం మతానికి కట్టుబడి ఉంటారు.[3]
సా.శ.. మొదటి - రెండవ శతాబ్దంలో ఉత్తర ఇథియోపియా అంతటా విస్తరించిన స్థాపించబడిన ఆక్సం రాజ్యమే ఆధునిక ఎరిట్రియా ప్రాంతంగా ఉంది.[4][5] ఇది నాలుగవ శతాబ్దం మధ్యలో క్రైస్తవ మతాన్ని స్వీకరించింది.[6] మధ్యయుగ కాలంలో ఎరిట్రియా మెదీరి బహ్రీ సామ్రాజ్యం పాలనలోకి పడిపోయింది. చిన్న ప్రాంతం హమాసియానులో భాగంగా ఉంది.
పలు స్వతంత్ర విభిన్న రాజ్యాలు, సుల్తానేట్సు (ఉదాహరణకి మెదీరీ బహ్రీ, ఆస్మా సుల్తానేటు) లతో విలీనమైన ఫలితంగా ఇటలీ ఎరిట్రియా ఏర్పడింది. 1942 లో ఇటలీ వలస సైన్యం ఓటమి చెందిన తరువాత, 1952 వరకు ఎరిత్రియా పాలన బ్రిటీషు సైనిక పాలనా యంత్రాంగం నిర్వహించింది. ఐక్యరాజ్యసమితి జనరలు అసెంబ్లీ నిర్ణయాన్ని అనుసరించి 1952 లో ఎరిత్రియా స్వయంగా స్థానిక పార్లమెంటుగా పాలనాబాధ్యతలు స్వీకరించింది. విదేశీ వ్యవహారాలు, రక్షణ ఇథియోపియా ఫెడరలు హోదాలో 10 సంవత్సరాలు ఉంది. 1962 లో ఇథియోపియా ప్రభుత్వం ఎరిత్రియా పార్లమెంటును రద్దు చేసి అధికారికంగా ఎరిత్రియాను విలీనం చేసుకుంది. 1941 లో ఇటాలియన్లు తొలగించిన తరువాత ఎరిత్రియన్లు జరగబోయేది ఊహించి ఎరిత్రియా స్వాతంత్ర్యం కొరకు పోరాడారు. 1960 లో ఎరిత్రియా లిబరేషన్ ఫ్రంట్ ఇన్ అపోజిషను ఏర్పాటుచేయబడింది. 1991 లో స్వాతంత్ర్యం కొరకు 30 సంవత్సరాల నిరంతర సాయుధ పోరాటం తరువాత ఎరిత్రియా విముక్తి యోధులు రాజధాని నగరమైన అస్మారాలో విజయం సాధించారు.
ఏకపార్టీ ప్రభుత్వం అయిన ఎరిత్రియా స్వతంత్రం నుండి ఎన్నడూ జాతీయ శాసనసభ ఎన్నికలు నిర్వహించ లేదు.[7] హ్యూమను రైట్సు వాచి ఆధారంగా ఎరిత్రియా ప్రభుత్వం మానవ హక్కుల చరిత్ర ప్రపంచంలోనే అత్యంత దిగువస్థాయిలో ఉందని ఆరోపించబడింది.[8] ఎరిత్రియా ప్రభుత్వం ఈ ఆరోపణలను రాజకీయం లక్ష్యంగా ఆరోపించబడ్డాయని త్రోసిపుచ్చింది.[9] నిరవధికంగా నిర్బంధ శిబిరాల అవసరార్ధం దీర్ఘకాలం నిర్బంధ సైనిక సేవ కోరబడుతుంది. దీని నుండి తప్పించుకోవడానికి కొంతమంది ఎరిత్రియన్లు దేశాన్ని విడిచి వెళ్లిపోతారు.[10] స్థానిక మాధ్యమాలు అన్నీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున ఎరిత్రియా ప్రపంచ ప్రెసు ఫ్రీడం ఇండెక్సులో చివరి ద్వితీయ స్థానంలో ఉంది., చివరి స్థానంలో ఉత్తర కొరియా ఉంది.
ఎరిత్రియా సార్వభౌమ దేశం ఆఫ్రికా సమాఖ్య, ఐక్యరాజ్యసమితి, ఇంటరు ఇంటరుగవర్నుమెంటలు అథారిటీలో సభ్యదేశంగా ఉంది. బ్రెజిల్, వెనిజులా, భారతదేశం, టర్కీలతో కలిసి అరబు లీగులో ఒక పరిశీలకసభ్యదేశంగా ఉంది.[11]