ఒ.ఎన్.వి.కురుప్
మలయాళం రచయిత / From Wikipedia, the free encyclopedia
ఒట్టాప్లక్కల్ నంబియదిక్కల్ వేలు కురుప్ (మళయాళం|ഒറ്റപ്ലാക്കല് നമ്പിയാടിക്കൽ വേലു കുറുപ്പ്[1]), ఒ.ఎన్.వి.కురుప్గా లేదా ఒ.ఎన్.వి.గా ప్రాచుర్యం పొందారు. కురుప్ మలయాళంలో ప్రసిద్ధ కవి, కేరళకు చెందిన మలయాళ సినీపరిశ్రమలో ప్రాచుర్యం పొందిన సినీ గేయకర్త. భారతదేశంలో సాహిత్యరంగానికి లభించే అత్యుత్తమ పురస్కారాల్లో ఒకటైన జ్ఞానపీఠ్ పురస్కారాన్ని 2007 సంవత్సరంలో పొందారు. ఒ.ఎన్.వి.కురుప్ మలయాళ సినీపరిశ్రమలో సినీకవిగా ఎన్నో సినిమాలకే కాక, నాటకాలకు, టి.వి.సీరియళ్ళకి కూడా గేయరచన చేశారు. 1998లో భారతప్రభుత్వం ప్రకటించే నాలుగవ అత్యుత్తమ పౌరపురస్కారమైన పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో రెండవ అత్యున్నత పౌరపురస్కారమైన పద్మవిభూషణ్ పురస్కారాన్ని పొందారు. 2007లో ఆయన చదివిన తిరువనంతపురంలో కేరళ విశ్వవిద్యాలయమే ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఒ.ఎన్.వి. వామపక్ష అనుకూలవాదిగా పేరుపొందారు.[2] 1989 సార్వత్రిక ఎన్నికల్లో వామపక్ష ప్రజాస్వామిక వేదిక (లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్) తరఫున తిరువనంతపురం లోక్సభ అభ్యర్థిగా పోటీచేశారు.[3]
ప్రొఫెసర్. డాక్టర్ ఒ.ఎన్.వి.కురుప్ | |
---|---|
జననం | (1931-05-27)1931 మే 27 చవరా |
మరణం | 2016 ఫిబ్రవరి 13(2016-02-13) (వయసు 84) |
జాతీయత | భారతీయుడు |
పౌరసత్వం | భారత దేశం |
విద్య | మాస్టర్స్ డిగ్రీ |
విద్యాసంస్థ | చవరా ప్రభుత్వోన్నత పాఠశాల, ట్రావెన్కోర్ విశ్వవిద్యాలయం(ప్రస్తుతం కేరళ విశ్వవిద్యాలయం), తిరువనంతపురం |
వృత్తి | కవి, గీతరచయిత, ఆచార్యుడు |
గుర్తించదగిన సేవలు | అగ్ని శలభంగళ్, అక్షరం, ఉప్పు, భూమిక్కొరు చరమగీతం, ఉజ్జయని, స్వయంవరం |
బిరుదు |
|
జీవిత భాగస్వామి | సరోజిని |
పిల్లలు | రాజీవన్, మాయాదేవి |
తల్లిదండ్రులు | ఒ.ఎన్.కృష్ణకురుప్, కె.లక్ష్మీకుట్టి అమ్మ |