కేరళ
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
కేరళ (ఆంగ్లం: Kerala,കേരളം )తెలుగు రాష్టాలకు నైరుతి దిశలో మలబార్ తీరాన ఉన్న రాష్ట్రం. కేరళ సరిహద్దులలో తూర్పు, ఉత్తరం కర్ణాటక, తూర్పు తమిళనాడు రాష్ట్రాలు, పడమర దిక్కున అరేబియా సముద్రం, దక్షిణాన తమిళనాడు కు చెందిన కన్యాకుమారి జిల్లా ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి చెందిన మాహె పూర్తిగా కేరళలోనే ఉంది. దక్షిణ భారతంగా పరిగణించబడే ఐదు రాష్ట్రాలలో కేరళ ఒకటి. సా. శ. పూ.10 వ శతాబ్దంలో ద్రావిడ భాషలు మాట్లాడే వారు ఇక్కడ స్థిరపడ్డారు. మౌర్య సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. తరువాతి కాలంలో చేర సామ్రాజ్యంలోను, భూస్వామ్య నంబూదిరిల పాలనలోను ఉంటూ వచ్చింది. విదేశాలతో ఏర్పరచుకుంటున్న సంబంధాలు చివరకు స్థానికులకు, ఆక్రమణదారులకు మధ్య ఘర్షణలకు దారితీసాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అనుసరించి 1956 నవంబరు 1 న కేరళ పూర్తి స్థాయి రాష్ట్రంగా అవతరించింది. 19వ శతాబ్దంలో కొచ్చిన్, తిరువాన్కూరు సంస్థానాలు చేపట్టిన సామాజిక సంస్కరణలు స్వాతంత్ర్యం తరువాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించారు. అందువలన మూడో ప్రపంచ దేశాల్లోనే అత్యధిక అక్షరాస్యత ఉన్న, అత్యంత ఆరోగ్యకరమైన ప్రాంతంగా కేరళ నిలిచింది. అయితే, ఆత్మహత్యలు, నిరుద్యోగం, నేరాలు భారతదేశం లోని అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ ఒకటి.[1]
కేరళ | |
రాజధాని - అక్షాంశరేఖాంశాలు |
తిరువనంతపురం - 8.47°N 76.95°E / 8.47; 76.95 |
పెద్ద నగరం | తిరువనంతపురం |
జనాభా (2001) - జనసాంద్రత |
31,838,619 (12వ) - 819/చ.కి.మీ |
విస్తీర్ణం - జిల్లాలు |
38,863 చ.కి.మీ (21వ) - 14 |
సమయ ప్రాంతం | IST (UTC యుటిసి+5:30) |
అవతరణ - [[కేరళ |గవర్నరు - [[కేరళ |ముఖ్యమంత్రి - చట్టసభలు (సీట్లు) |
నవంబర్ 1, 1956 - పి.సదాశివం - పినరాయి విజయన్ - ఒకే సభ (141) |
అధికార బాష (లు) | మలయాళం |
పొడిపదం (ISO) | IN-KL |
వెబ్సైటు: www.kerala.gov.in | |
కేరళ రాజముద్ర |
కేరళకు ఆ పేరెలా వచ్చిందనే విషయంలో వివాదం ఉంది. కేర అంటే కొబ్బరి చెట్టు, ఆళం అంటే భూమి. ఈ రెండిటి నుండి కొబ్బరిచెట్ల భూమిగా కేరళం అయింది అనేది ఒక వాదన. ఈ విధంగా కేరళీయులు తమ భూమిని కేరళంగా పిలుచుకుంటారు. చేర, ఆళం అనగా చేరుల భూమి అనే మాట నుండి కేరళం వచ్చిందనేది మరో వాదన. ట్రావన్కోర్ (తిరువాన్కూరు) రాజు రాజా మార్తాండ వర్మ తన రాజ్యాన్ని తిరువనంతపురం లోని పద్మ నాభ స్వామికి అంకితం చేసి అతని దాసునిగా రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత అతని వారసులైన రాజులు కూడా ఆ విధంగానే చేసారు. రాజ ముద్రలు దేవుని పేరునే ఉండేవి. అందుకనే కేరళను "దేవుని స్వంత దేశం" అని భావిస్తారు.