ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం
From Wikipedia, the free encyclopedia
ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం (బెంగాలీ: ধামরাই জগন্নাথ রথ) బంగ్లాదేశ్లోని ధామ్ రాయ్ లో ఉన్న పవిత్ర హిందూ దేవాలయం. ఇక్కడి ప్రధాన ఆరాధ్య దైవం జగన్నాథుడు. ఈ దేవాలయం రథం ఆకారంలో ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి జరిగే జగన్నాథుడి రథయాత్ర వేలాది మంది ప్రజలను ఆకర్షిస్తున్న ఒక ప్రసిద్ధ హిందూ పండుగ. బంగ్లాదేశ్లోని హిందూ సమాజానికి ధామ్ రాయ్ లోని ఈ రథయాత్ర అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటి. జగన్నాథుడిని హిందువులు విష్ణువు అవతారంగా విశ్వసిస్తారు.[1]
ధామ్ రాయ్ జగన్నాథ దేవాలయం | |
---|---|
ধামরাই জগন্নাথ রথ | |
భౌగోళికం | |
దేశం | బంగ్లాదేశ్ |
సంస్కృతి | |
దైవం | జగన్నాథ స్వామి |
వేలాది మంది హిందూ భక్తులు ఇక్కడికి తరలి రావడం కారణంగా, ఇది పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది, రథాలతో పాటు భారీ ఊరేగింపులు డప్పులు, మృదంగం, భక్తి పాటలు వంటివి నగరాన్ని పరవశింపజేస్తాయి. రథంపై జగన్నాథుని దర్శనం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. సాధువులు, కవులు, ఈ ప్రత్యేక పండుగ పవిత్రతను పదేపదే కీర్తిస్తారు. పండుగ పవిత్రత ఏమిటంటే, రథాన్ని లేదా కనీసం దానిని లాగిన తాళ్లను అయినా స్పర్శించడం వలన అనేక పుణ్య కార్యాలు లేదా యుగయుగాల తపస్సుల ఫలితాలను పొందిన వాళ్ళమౌతామని భక్తుల నమ్మకం.