పసునూరి రవీందర్
From Wikipedia, the free encyclopedia
పసునూరి రవీందర్ కవిగా, రచయితగా తెలుగు సాహితీ జగత్తుకు సుపరిచితుడు. తెలంగాణ రాష్ట్రం నుండి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కారం అందుకున్న రచయిత. తెలంగాణ ఉద్యమ గేయసాహిత్యంపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నారు[ఆధారం చూపాలి] . వరంగల్ జిల్లా శివనగర్ ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై జనవరి 8న జన్మించారు.
పసునూరి రవీందర్ | |
---|---|
జననం | జనవరి 8 వరంగల్ జిల్లా శివనగర్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు |
వృత్తి | రచయిత |
"ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు సాహిత్యం -విమర్శ"అనే అంశం మీద ఎంఫిల్, "తెలంగాణ గేయసాహిత్యం-ప్రాదేశిక విమర్శ"అనే అంశంపై పి.హెచ్డీ చేశారు. పసునూరి రాసిన వ్యాసాలు పలు దిన, వార పత్రికల్లో అచ్చయ్యాయి. 'దస్కత్'తెలంగాణ కథా వేదికకు కన్వీనర్గా పనిచేసారు. తెలంగాణ ఉద్యమంలో సాహిత్యకారులను కూడగట్టి ఉద్యమ బాట పట్టించిన "సింగిడి" తెలంగాణ రచయితల సంఘానికి కన్వీనర్గా పనిచేశారు. తాను రాసిన అవుటాఫ్ కవరేజ్ ఏరియా కథా సంపుటికి కేంద్రసాహిత్య అకాడెమి యువ పురస్కారం లభించింది. జాషువా, బోయి భీమన్నల తర్వాత సాహిత్య అకాడెమి చేత గౌరవాన్ని అందుకున్న దళిత రచయిత రవీందరే.[1] కొంతకాలం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అధ్యాపకునిగా (గెస్ట్ ఫ్యాకల్టీగా) పని చేశారు.
ప్రస్తుతం అద్దం డిజిటల్ డైలీ పత్రికకు చీఫ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.