భారతీయ క్రాంతి దళ్
భారతదేశంలోని మాజీ రాజకీయ పార్టీ / From Wikipedia, the free encyclopedia
భారతీయ క్రాంతి దళ్ అనేది ఒక రాజకీయ పార్టీ. దీనిని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి చరణ్ సింగ్ స్థాపించాడు. 1967 అక్టోబరులో లక్నోలో జరిగిన సమావేశంలో పార్టీ స్థాపించబడింది.[1] 1977 సాధారణ ఎన్నికల తరువాత, భారతీయ క్రాంతి దళ్ వారసుడు, భారతీయ లోక్ దళ్ జనతా పార్టీలో విలీనం చేయబడింది.[2]
త్వరిత వాస్తవాలు భారతీయ క్రాంతి దళ్, స్థాపకులు ...
భారతీయ క్రాంతి దళ్ | |
---|---|
స్థాపకులు | చరణ్ సింగ్ |
స్థాపన తేదీ | 1967 అక్టోబరు |
రంగు(లు) | ఆకుపచ్చ |
Election symbol | |
మూసివేయి
హుమాయున్ కబీర్ ఢిల్లీలో కాంగ్రెసేతర ముఖ్యమంత్రులు, ఇతర ముఖ్య నేతలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో 1967 ఏప్రిల్ 9న భారతీయ క్రాంతి దళ్ ఏర్పాటుకు బీజాలు పడ్డాయి.[3] 1967 నవంబరులో భారతీయ క్రాంతి దళ్ ఇండోర్ సమావేశంలో, మహామాయ ప్రసాద్ సిన్హా పార్టీ మొదటి ఛైర్మన్గా ఎన్నికయ్యాడు.[3]