మధ్య ప్రదేశ్ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో రీవా జిల్లా ఒకటి. రీవా పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులులకు కేంద్రంగా ఉంది. రీవా తెల్లపులకు కూడా గుర్తించబడుతుంది.
Rewa జిల్లా
रीवा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మధ్య ప్రదేశ్ |
డివిజను | Rewa |
ముఖ్య పట్టణం | Rewa, India |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | Rewa |
విస్తీర్ణం | |
• మొత్తం | 6,240 కి.మీ2 (2,410 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 23,63,744 |
• జనసాంద్రత | 380/కి.మీ2 (980/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.42% |
• లింగ నిష్పత్తి | 930 |
ప్రధాన రహదార్లు | NH 7, NH 27, NH 75 |
Website | అధికారిక జాలస్థలి |
Rewa lies between 24-0- 18’ నుండి 25- 0 - 12’ డిగ్రీల ఉత్తర అక్షాంశం 81 - 0 - 2’, 82 - 0 - 18’. తూర్పు రేఖాంశంలోనూ ఉంది.[1] .
జిల్లా ఉత్తర సరిహద్దులో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, తూర్పు, ఆగ్నేయ సరిహద్దులో సిద్ధీ జిల్లా, దక్షిణ సరిహద్దులో షాడోల్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సత్నా జిల్లా ఉన్నాయి.[2] హుజూర్, సిర్మౌర్, ముగంజ్ తాలూకాలు కైమూర్ భూభాగంలో దక్షిణంలో ఉన్నాయి. వింద్యపర్వతాలు ఉత్తరం, అక్కడి నుండి రీవా (అప్రిహా) ఉంది. ఉత్తరంలో ఉన్న తియోంతర్ తాలూకా భౌగోళికంగా పీఠభూమిలోని మిగిలిన తాలూకాలకంటే విభిన్నంగా ఉంటుంది. రీవా పీఠభూమి దక్షిణం ఉత్తరానికి ఏటావాలుగా ఉండి ఉత్తరంలో దిగుడు భూమి ఉంటుంది. ఉత్తరంలో ఎత్తు సముద్రమట్టానికి 450మీ ఎత్తున ఉంటుంది. తియోంతర్ మైదానంలోని సారవంతమైన భూమి సముద్రమట్టానికి 100 మీ. ఎత్తు మాత్రమే ఉంటుంది. జిల్లాలోని భూభాగాలు సారవంతమైన మైదానాలు, పర్వత ప్రాంతం, లోయలు, నిటారు పర్వతాలు, నదులు, జలపాతాలు కలగలుపుగా ఉండి భౌగోళిక విభిన్నత కలిగి ఉన్నాయి. జిల్లాలో జన్మించిన తామసా, సన్ నదులు గంగానదిలో సంగమిస్తున్నాయి.[1]
రీవా నగరం నుండి బిచియా నది ప్రవహిస్తుంది. తామసా నది, దాని ఉపనదీ జలపాతాల రీవా పీఠమూమి నుండి ప్రవహిస్తుంటాయి. చాచై జలపాతం (127) మీ. జలాలు తామసా ఉపనది బింద్ నదికి చేరుకుంటాయి. కెయోతీ జపాతం (98మీ) జలాలు మహానా నదికి చేరుకుంటాయి. బహుతీ జలపాతం (145మీ) జలం బెలాహ్ నది ఉపనది ఒడ్డా నదికి చేరుకుంటాయి. బెలాహ్ నది తామసానదికి ఉపనది. పూర్వా జలపాతం ( 70 మీ) జలాలు తామసా నదికి చేరుకుంటాయి.[3]
రీవా జిల్లాలో 10 తాలూకాలు ఉన్నాయి :- మంగవ, నైగర్హి, శ్రీమౌర్, జావా, తెఒంథర్, హనుమన, హుజుర్, రాయ్పూర్ కర్చులీన్, మౌగంజ్, సెమరియ.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 2,363,744,[4] |
ఇది దాదాపు. | లటివ దేశ జనసంఖ్యకు సమానం.[5] |
అమెరికాలోని. | న్యూమెక్సికో నగర జనసంఖ్యకు సమం..[6] |
640 భారతదేశ జిల్లాలలో. | 191వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 374 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.79%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 73.42%.[4] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 930:1000 [4] |
జాతియ సరాసరి (72%) కంటే. |
రీవా జిల్లాలో హిందీ ప్రధాన, అధికార భాషగా ఉంది.ఆస్ట్రోయాసియాటిక్ భాషాకుటుంబానికి చెందిన అగరియా భాషకు 72,000 వాడుకరులు ఉన్నారు.[7] రీవా జిల్లాలో బఘేలి భాష వాడుకలో ఉంది. ఇది హిందీ భాషను పోలి ఉంటుంది. ఈ భాష 72.91% ప్రజలకు వాడుక భాషగా ఉంది.[8] (జర్మన్, ఇంగ్లీష్ 60% పోల్చితే) [9] ఈ భాషకు 78,00,000 మంది వాడుకరులు ఉన్నారు.[8]
దియోర్కొర్తర్ (దెయూర్) లో ప్రసిద్ధ బుద్ధస్థూపం ఉంది. క్రీ.పూ 3 వ శతాబ్దంలో మౌర్యచక్రవర్తి అశోకుడు ఈ స్థూపాన్ని నిర్మించారని భావిస్తున్నారు. పురాతన కాలంలో ఈ ప్రాంతం దక్షుణాపథంలో భాగంగా ఉండేది. దక్షిణాపథం అంటే తూర్పు పడమరలుగా ఉన్న వ్యాపార మార్గం. పాటలీపుత్ర (పాట్నా) నుండి మహారాష్ట్రం లోని ప్రతిష్ఠానపురం వరకు ఉండేది.
రీవాలో మహారాజా మార్తాండ సింఘ్ దాదాపు 2 సంవత్సరాల పులిపిల్లను ఈ ప్రాంతంలో పట్టుకున్నాడు. పులి మహారాజ వేసవి శిబిరంలో 5 జీవించిన తరువాత మరణించింది. తరువాత దీనిని స్టఫ్ చేసి రాజా జార్జ్కు విశ్వాశచిహ్నంగా పంపాడు. ఇప్పటి వరకు తెల్లపులి మహారాజా వేసవి నిడిది (గోవిందగర్) లో బధ్రపరచబడి ఉంది.
1951లో మహారాజా మార్తాండ సింగ్ పట్టుకున్న తెల్ల పులిపిల్ల పేరు మోహన్. మహారాజా మార్తాండ సింగ్ బంధవ్గర్ వద్ద వేటాడుతున్న సమయంలో మే 25న ఈ పులిపిల్ల పట్టుబడిన 4 పులి పిల్లాలలో ఇది తెల్లపులి పిల్ల ఒకటని రికార్డులో ఉంది. పులి కాల్చబడింది. తరువాత తెల్లపులి పిల్ల తప్పించుకున్నది. తరువాత తెల్ల పులిపిల్లను పట్టుకుని 150 గదులున్న మహారాజా వేసవి నిడిదిలో ఒక పెద్ద ఆవరణలో సంరక్షించబడింది. (ఆరోజులలో రాజులు పులులను వాటి పిల్లలతో వేటాడడానికి అనుమతి ఉంది). పట్టుబడిన 3 రోజులలో తెల్లపులిపిల్ల తప్పించుకున్నది. తరువాత తీవ్రంగా శోధించిన తరువాత తిరిగి పట్టుబడింది. తరువాత పులిపిల్లను బంధించిన ఆవరణను సరిచేసి పులిపిల్లను అక్కడ బంధించారు. తరువాత అది మోహన్ అన్నపేరుతో తనజీవితకాలం అక్కడే గడిపుంది.
రీవా జిల్లా గుండా లైమ్స్టోన్ బెల్ట్ ఉంది. జిల్లాలో సమీపంలోని షాడోల్, సిధి, ఉమరియా, సింగ్రౌలి జిల్లాలో బొగ్గునిక్షేపాలు లభించాయి. సమీపంలోని నౌబస్తా, సత్నా (బెలా), సిధి (భగ్వర్) జిల్లాలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. జయపీ గ్రూప్ జయపీ నగర్ పేరుతో రీవాలో టౌన్ షిప్ నిర్మించింది. ఆసియాలోని అతిపెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ " ప్రిసం సెమెంట్ " (గతంలో రాశి సెమెంట్), రీవా సమీపంలో ఉంది. జిల్లాలో వింద్యా టెలే లింక్స్, బిర్లా ఎరిక్షన్ లిమిటెడ్ కూడా ఉన్నాయి.
2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో రీవా జిల్లా ఒకటి అని గుర్తించింది.[10] బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న మధ్యప్రదేశ్ రాష్ట్ర 24 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[10]
రీవా జిల్లా రైలుమార్గాలతో అనుసంధానించబడి ఉంది. ఇక్కడి నుండి సత్నాకు 50 కి.మీ రైలుప్రయాణంతో చేరుకోవచ్చు. సత్నా రైల్వే స్టేషను ముబై - హౌరా మార్గంలో ఉంది.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.